సినీ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యభరిత చిత్రాల తెరకెక్కకించిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తీయడమే కాదు.. ఇందులో భారీ తారాగణం కూడా నటించారు. ఈ నెల 30 న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో పొన్నియన్ సెల్వం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో భారీ ఎత్తున జరిగింది. ఈ సందర్బంగా హీరో విక్రమ్, కార్తీ తెలుగు ప్రేక్షకులపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
చియాన్ విక్రమ్ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నేను ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించాను.. ఆ పాత్రలను ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరించారు. ఈ మూవీలో నేను గుర్రంపై వచ్చే ఒక షాట్ చాలా అద్భతంగా తీశారు.. ఆ సీన్ ఎలా ఎంత బాగా ఉంటుందో తెరపై చూడాల్సిందే. ఇక ఈ మూవీలో ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించారు.. ఈ స్టేజ్ పై చూడండి అందరూ హీరోలు, హీరోయిన్లే ఉన్నారు. ఈ మద్య కాలంలో ఇంత భారీ తారాగణం నటించిన చిత్రం ఇదేనేమో.. ఇక తెలుగు ప్రేక్షకుల అంటే నాకు ఎంతో అభిమానం.. మీరు తెలుగు ప్రేక్షకులు కాదు.. సినిమా పిచ్చోళ్ళు. మీరు ఆదరిస్తున్నారు.. మేం నటిస్తున్నాం. ఈ వేధిక ద్వారా మీమ్మల్ని మళ్లీ కలుసుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అన్నారు.
హీరో కార్తి మాట్లాడుతూ.. ‘ఇది మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇందులో నటించే అవకాశం దక్కినందకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ మూవీ బాహుబలిలా ఉంటుందా అని అడుగుతున్నారు.. ఇక్కడ మనకు ఎన్నో కథలు ఉన్నాయి.. కొత్త అంశాలను తెరకెక్కించాలి. ఒక గొప్ప నవలని మణిరత్నం స్టడీ చేసి ఈ సినిమా తీశారు. ఇందులో అందరూ గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు.. వారితో కలిసి పనిచేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ మూవీలో ప్రేమ, అడ్వెంచర్, కుటిల రాజకీయాలు అన్నీ ఉన్నాయి.
ఈ మూవీలో డైలాగ్స్ చెప్పడానికి ఎంతో కష్టపడ్డాం.. యన్టీఆర్ లాంటి మహానటుడిని గుర్తు చేసుకొని మరీ చెప్పాం. ఇక తెలుగు ప్రేక్షకులు మమ్ముల్ని ఎప్పుడూ ఆదరిస్తూ… అభిమానిస్తున్నారు. తెలుగు ప్రజలు మాకు ఇచ్చే ప్రేమకు కృతజ్ఞతలు’ అన్నారు. ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్’ప్రీ రిలీజ్ ఈవెంట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.