ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సపన్ సెంగుప్త కన్నుమూశారు. గతకొద్ది నెలలుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల వయసులో శనివారం కన్నుమూశారు. ముంబై, పావాయ్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సపన్ సెంగుప్త మరణవార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెంగుప్త మరణంపై ఆయన కూతురు శిల్పి ఘోష్ మాట్లాడుతూ.. ‘‘ నాన్న ఢాకాలో జన్మించారు. కోల్కతాలో పెరిగారు. 1957 టైంలో ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలన్న కలతో బాంబేకు వెళ్లారు. అక్కడే నాన్నకు జగ్మోహన్తో పరిచయం అయింది. సింగర్లకు పోటీ ఎక్కువగా ఉందని భావించిన ఇద్దరూ మ్యూజిక్ డైరెక్టర్లు అవ్వాలనుకున్నారు. నాన్న డబ్బుల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు.
అయితే, ఓ సారి ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ‘మేరే జీవన్ కుచ్ కామ్ నాఆయా’ పాట కంపోజ్ చేసిన తర్వాత అస్సలు డబ్బులు తీసుకోలేదు. ఆ పాటకు తాను చేసిన కంపోజింగ్ నచ్చి అలా చేశారు. నాన్న జనవరి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. జులై 17న ఆయన 90వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపాము. కేక్ కట్ చేసి ఆయనకు తినిపించాము’’ అని ఆమె అన్నారు. కాగా, సపన్ సెంగుప్త, జగ్మోహన్లు కలిసి మ్యూజిక్ డైరెక్షన్ చేసేవారు. 1960-70లలో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. కొద్దికాలానికే ఇద్దరూ వేరు వేరు అయ్యారు.