నిత్యం వివావాదలు, సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి నేపథ్యంలో టాలీవుడ్ని టార్గెట్ చేసిన ఆర్జీవీ.. ట్విట్టర్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీ సిగ్గు పడాలని మండి పడ్డారు. ఇంతకు ఆర్జీవీ.. ఏ విషంయలో ఇంతలా ఫైర్ అవుతున్నాడంటే.. కృష్ణంరాజుకి వీడ్కోలు పలకడంలో టాలీవుడ్ సరైన రీతిలో స్పందించలేదని.. ఓ మహానటుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆర్జీవీ ఫైర్ అయ్యారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కృష్ణంరాజుకి సరైన వీడ్కోలు ఇవ్వలేదని, అత్యంత స్వార్ధపూరిత సినీ ఇండస్ట్రీ ఇదేనంటూ వ్యాఖ్యానించడమే కాక.. సీనియర్ హీరలు కృష్ణ, మురళీ మోహన్లతో పాటు చిరంజీవి, మోహన్బాబు, బాలకృష్ణ, ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్లను ఉద్దేశిస్తూ.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ట్వీట్లు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఆ వివరాలు
కృష్ణంరాజు మృతి నేపథ్యంలో ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా.. ‘‘భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత అయిన కృష్ణంరాజు వంటి గొప్ప వ్యక్తి కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!’’ అంటూ ఘాటుగా ట్వీట్ చేశాడు.
భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!
— Ram Gopal Varma (@RGVzoomin) September 11, 2022
అంతేకాక ఈ విషయంలోకి పలువురు ప్రముఖులను లాగుతూ.. ‘‘ఈ సందర్భంగా నేను కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, బాలయ్యకి, చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్బాబు, ప్రభాస్ వంటి వారికి ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీకు కూడా రావొచ్చు. ఒక మహోన్నత కళాకారుడికి మహోన్నత వీడ్కోలు ఇవ్వలేకపోవడం అంటే.. మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది. మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం.. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపేద్దాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది. మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం.. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం’’ అని ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ పిలుపునిచ్చారు. మరి దీనిపై ఇండస్ట్రీ ప్రముఖులు ఎలా రియాక్టవుతారో చూడాలి. ఆర్జీవీ చేసిన ట్వీట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి , మోహనబాబుగారికి, బాలయ్యకి , ప్రభాస్ కి,మహేష్,కల్యాణ్కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.
— Ram Gopal Varma (@RGVzoomin) September 11, 2022
మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది 🙏
— Ram Gopal Varma (@RGVzoomin) September 11, 2022
మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. @urstrulyMahesh @PawanKalyan @KChiruTweets @AlwaysRamCharan @alluarjun @themohanbabu @tarak9999 @ssrajamouli
— Ram Gopal Varma (@RGVzoomin) September 11, 2022