జాన్వీ కపూర్.. శ్రీదేవీ- బోనీ కపూర్ కుమార్తెగా బీ టౌన్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. నటన, గ్లామర్ విషయంలో ఇప్పటికే శ్రీదేవిలా ఉందంటూ మార్కులు కొట్టేసింది. చేసింది నాలుగే సినిమాలు అయినా ఫ్యాన్ బేస్ ను బాగానే సంపాదించింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. గుడ్ లక్ జెర్రీ, మిలీ అనే రెండు సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అవే కాకుండా మరో రెండు ప్రాజెక్టులు చేస్తోంది. జాన్వీ కపూర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటుంది.
లేటెస్ట్, డైలీ అప్డేట్స్ మొత్తం ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటుంది. ఆమెకు 16.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారంటేనే చెప్పొచ్చు ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందనేది. తాజాగా మే నెలలో ఇప్పటి వరకు జరిగిన విషయాలు, తాను చేసిన ఫొటో షూట్లకు సంబంధించి ‘ఇప్పటివరకు మే నెల ఎలా జరిగిందంటే’ అంటూ కొన్ని ఫొటోలును షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వాటిలో ముఖ్యంగా యోగాసనాలు వేసిన ఫొటోలు సోషల్ మీడియా సెన్సేషన్ గా మారాయి. జాన్వీ కపూర్ ఫిట్ నెస్ విషయంలో ఎంతో పర్టిక్యూలర్ గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ ఆమె జిమ్ లో ఉన్న వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. అంతేకాకుండా యోగా కూడా చేస్తుంటుంది, దాని ప్రాముఖ్యతను వివరించేలా ఆసనాలు వేసి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. జాన్వీ కపూర్ యోగాసనాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.