Prudhvi Raj: టాలీవుడ్ లో కమెడియన్ గా మంచిపేరు తెచ్చుకున్న ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీరాజ్.. గతంలో రాజకీయాల్లో చేరి సినీతారలపై విమర్శలు గుప్పించి వివాదాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అనంతరం కరోనా బారినపడి కోలుకున్న తర్వాత ఎవరెవరినైతే విమర్శించాడో వాళ్ళను కలిసి క్షమాపణలు తెలుపుకున్నట్లు చెప్పేశాడు. ప్రస్తుతం మళ్లీ సినిమాలలో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.
ఇక ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. “8 ఏళ్లుగా నేను నా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను. నేను హైదరాబాద్ లో ఉంటున్నా. నా భార్య పిల్లలు విజయవాడలో ఉంటున్నారు. పిల్లలు సెటిల్ అయిపోయారు. అయితే.. నేను చెన్నైలో ఉన్నప్పటి నుండి నాకు ఒకావిడ పరిచయం. వరంగల్ నుండి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. ఆమె పేరు దాసరి పద్మరేఖ. హెల్పింగ్ నేచర్ ఎక్కువ. నాకు ఏ సహాయం కావాలన్నా చేస్తారు.
నేను ప్రస్తుతం ఆమెతోనే ఉంటున్నాను. దాదాపు ఎనిమిదేళ్లుగా మేము మా ఫ్యామిలీస్ నుండి దూరంగా ఉంటున్నాం. అందుకు ఈవిడ కూడా ఓ కారణం. అలాగే అక్కడ మా ఫ్యామిలీతో గొడవలు, కేసులు మరో కారణం. నా భార్యకు నాకు విడాకులు కాలేదు. కానీ, ఇప్పటికీ కోర్టు, కేసులు గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను సపరేట్ గా ఉంటున్నాను. నా పక్కన ఎవరైనా ఉన్నారంటే దాసరి పద్మరేఖగారే. నాకు ఏం కావాలన్నా ఆమె చూసి పెడతారు” అంటూ చెప్పుకొచ్చారు పృథ్వీరాజ్. ప్రస్తుతం పృథ్వీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి పృథ్వీ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.