సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం.. ఇక్కడ రాణించాలంటే.. అంత సులువు కాదు. ఎంతో హార్డ్వర్క్, కృషి, సంకల్పం, పట్టుదలతో పాటు కాసింత అదృష్టం కూడా తోడవ్వాలి. సరే అన్ని కలిసి వచ్చి.. అవకాశాలు లభిస్తే.. దాన్ని నిలబెట్టుకుని.. ఏళ్ల పాటు.. ఆ స్టార్డమ్ను కొనసాగించడం అంటే అంత సులువు కాదు. మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఇవన్ని సాధ్యం అయ్యాయి. ఏళ్ల పాటు అభిమానులను అలరిస్తూ.. వాళ్లని మెప్పిస్తూ.. సూపర్ స్టార్ రేంజ్కి ఎదిగారు. అయినా సరే తాను నడిచి వచ్చిన మూలాలను మరిచిపోకుండా.. ఒదిగి ఉండటం కేవలం చిరంజీవికి మాత్రమే సాధ్యమయ్యింది. ఈ రోజు తాను అనుభవిస్తున్న ఈ స్టార్డం ప్రేక్షకులు ఇచ్చిందే అనే కృతజ్ఞతను మరిచిపోకుండా.. తనకు తోచిన మేర సమాజ సేవ చేస్తూ.. తెలుగు ప్రేక్షకులందరి చేత అన్నయ్యగా పిలిపించుకుంటున్నారు చిరంజీవి.
తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి నాళ్లలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారో చిరంజీవికి బాగా తెలుసు.. కనుక ప్రస్తుతం ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి.. చిన్న ఆర్టిస్టిలకు చేయూతనివ్వడంలో ఎప్పుడు ఓ అడుగు ముందే ఉంటారు. తెలుగు సినీ చరిత్రలో ఆయనది ఓ శకం. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. నేడు మెగాస్టార్ రేంజ్కి ఎదిగారు చిరంజీవి. నాలుగు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో నటుడిగా, డ్యాన్సర్గా, నిర్మాతగా సుదీర్ఘ ప్రయాణం కొనసాగించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పురస్కారంతో సత్కరించింది. ఆ వివరాలు..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు. సినీ పరిశ్రమకు చిరంజీవి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డును కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రకటించింది. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ) ఉత్సవాల సందర్భంగా చిరంజీవికి కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు చిరంజీవి పేరును కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వేదిక మీదుగా ప్రకటించారు. మరోవైపు చిరంజీవికి లభించిన ఈ అరుదైన పురస్కారం గురించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఆదివారం ట్వీట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ-2022 అవార్డు దక్కినట్టు పేర్కొంది.
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘‘శ్రీ చిరంజీవి గారిది సుమారు నాలుగు దశాబ్దాల సుధీర్ఘ ప్రయాణం. 150 సినిమాల్లో నటుడిగా, డాన్సర్గా, నిర్మాతగా పనిచేశారు. తెలుగు సినిమా రంగంలో ఆయన చాలా పాపులర్. తన అద్భుతమైన నటనతో ఎందరో హృదయాలను గెలుచుకున్నారు’’ అని అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్కు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ అవార్డును తనకు ప్రకటించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తనను ఎంతగానో ప్రేమించే అభిమానుల వల్లే నేడు తాను ఈ స్థానంలో ఉన్నానని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం రావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
Greatly Delighted and Humbled at this honour, Sri @ianuragthakur !
My deep gratitude to Govt of India@MIB_India @IFFIGoa @Anurag_Office and all my loving fans only because of whom i am here today! https://t.co/IbgvDiyNNI— Chiranjeevi Konidela (@KChiruTweets) November 20, 2022
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ప్రతిష్టాత్మకంగా అందించే ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2013లో భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంరభించారు. అప్పటి నుంచి ఈ అవార్డును అందించడం ప్రారంభించారు. గతంలో చిరంజీవికి కన్నా ముందుగా వహీదా రెహమాన్ ఈ అవార్డును మొదటిసారి అందుకోగా… ఆ తర్వాత రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రమణ్యం, అమితాబ్ బచ్చన్, సలీం ఖాన్, బిశ్వజిత్ ఛటర్జీ, హేమ మాలిని, ప్రసూన్ జోషి వంటి ప్రముఖులు ఈ అవార్డు దక్కించుకున్నారు.
కాగా తాజాగా ఈ సంవత్సరం చిరంజీవికి ఈ అవార్డును అందించనున్నారు. నాలుగు దశాబ్దాల పైచిలుకు నుంచి సాగుతున్న అద్భుతమైన కెరీర్లో 150కి పైగా చిత్రాల్లో నటించినందుకు చిరంజీవికి ఈ అవార్డు అందించారు. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చిరంజీవి రెండు ‘వాల్తేరు వీరయ్య’.. భోళా శంకర్ సినిమాల్లో నటిస్తుండగా.. ఈ రెండు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.
Congratulations to Sri Chiranjeevi garu on being conferred ‘INDIAN FILM PERSONALITY OF THE YEAR 2022’ award at the @IFFIGoa.
An actor par excellence with more than 150 films to his credit, he has enthralled film enthusiasts with his brilliant performances.@KChiruTweets pic.twitter.com/PPpBDarpBS
— G Kishan Reddy (@kishanreddybjp) November 20, 2022
అన్నయ్య చిరంజీవి @KChiruTweets గారికి హృదయపూర్వక అభినందనలు – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/DcSQBaDNZe
— JanaSena Party (@JanaSenaParty) November 20, 2022
ధర్మం తెలిసిన ధర్మాత్ముడు న్యాయం, తెలిసిన న్యాయకోవిదుడు, మంచితనానికి మారుపేరు , మానవత్వం ఇంటిపేరు , అందరికీ నేనున్నా అనే మా అన్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు &అభినందనలు.🙏 @KChiruTweets pic.twitter.com/QrFOrv9Smk
— BANDLA GANESH. (@ganeshbandla) November 20, 2022