ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం తదితర కారణాలతో నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిలో ప్రముఖులు కూడా ఉండటం విచారకరం. కొన్ని రోజుల క్రితమే తెలుగు యూట్యూబ్ స్టార్ ఒకరు కారు ప్రమాదంలో మృతి చెందగా.. తాజాగా ఓ స్టార్ హీరో కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. వారం రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
తమిళ హీరో శింబు కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రస్తుతం చెన్నై పోలీసులు శింబు కారు డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ఆ వివరాలు.. మార్చి 18వ తేద రాత్రి 7గంటల సమయంలో ఎలాంగో సలై-పోస్ రోడ్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 70 ఏళ్ల వృద్ధుడిని కారు ఢీకొనడంతో.. అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో.. కారులో శింబు తండ్రి డైరెక్టర్, నటుడు రాజేందర్ కూడా ఉన్నారట.
ఇది కూడా చదవండి: విషాదం: షణ్ముఖ్ సరసన నటించిన హీరోయిన్ మృతి!
ప్రమాదం జరిగిన వెంటనే వృద్ధుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ ని కూడా పిలిపించాడు రాజేందర్. అయితే.. అంబులెన్స్ చేరుకునేలోపు సదరు వృద్ధుడు మునిస్వామి ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. చనిపోయిన వృద్ధుడు వికలాంగుడని.. అందుకే.. అతను రోడ్డుపై పాకుకుంటూ వెళ్లేది డ్రైవర్ కి కనపడలేదని వారు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: కొత్త షో కోసం శ్రీముఖి గ్లామరస్ లుక్.. ఫోటోస్ వైరల్!
ప్రమాదం జరిగిన మరుసటి రోజే కారు నడిపిన డ్రైవర్ ని పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్ సెల్వంను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి సమీపంలోని కొన్ని నివాసాలు, దుకాణాల్లోని CCTV కెమెరాల నుండి సేకరించిన ఫుటేజీని పోలీసులు తనిఖీ చేశారు. కాగా.. మృతుడు మునుసామి పేవ్మెంట్ నివాసి అని, అతను సుమారు 15 సంవత్సరాలుగా పొరుగున చిన్నపాటి ఉద్యోగాలు చేసేవాడని దర్యాప్తు అధికారి తెలిపారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: స్టార్ హీరోతో ప్రేమలో పడిన నిధి అగర్వాల్.. త్వరలో పెళ్లంట!
Cctv footage of a differently abled man being run over by a car that belonged to actor Simbu’s father and director T Rajendran at T Nagar @TOIChennai pic.twitter.com/WBvveHkk54
— SINDHU KANNAN (@SindhukTOI) March 23, 2022