ఎంతో మంది యువత ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కష్టబడుతుంటారు. నోటిఫికేషన్ ఎప్పుడు పడ్డుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందంటే నిరుద్యోగులకు పండగే. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లోని పలు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు నిర్వహించే పరీక్ష ఆన్ లైన్ లో విధానంలో ఉంటుంది. ఇందులో మెరిట్ ఆధారంగా పోస్టులకు అభ్యుర్ధులను ఎంపిక చేశ్తారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఎస్ఎస్సీ లోని పలు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియా మెటియోరోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ)లో గ్రూప్-బి ఉద్యోగాలైన పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ కోసం ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించాలని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 990 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ శాఖ కార్యాలయాలో సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రూప్-‘బి’ నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక పరీక్షలు ఆన్ లైన్ విధానంలో నిర్వహించున్నారు. ఆన్ లైన్ ద్వారా ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 30, 2022న ప్రారంభమవుతుంది. దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 18, వరకు ఉంటుంది. దరఖాస్తుల సవరణకగు అవకాశంగా అక్టోబర్ 25 ఉంటుంది. ఇక పరీక్ష విషయానికి వస్తే.. 2022 డిసెంబర్ నెలలో నిర్వహిస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు. ఏదైన సైన్స్ సబ్జెక్ట్ తో బ్యాచిలర్ డిగ్రీని గుర్తింపు పొందిన విద్యాసంస్థ/ విశ్వవిద్యాలయం నుంచి ఉత్తీర్ణలై ఉండాలి. అలాగే ఏదైనా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా తత్సమానం. ఇంటర్లో మ్యాథ్మెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
18-10-2022 నాటికి 30 ఏళ్లు మించకూడదు. 19-10-1992 కంటే ముందుగా మరియు 17-10-2004 కంటే తర్వాత జన్మించి ఉండకూడదు. నోటిఫికేషన్ లోని నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. రూ. 100 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మాజీ సైనికులుకి చెందిన మహిళ అభ్యర్ధులు ఫీజు చెల్లింపు మినహాయించబడ్డారు రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రెండు గంటల పాటు 200 మార్కులతో కూడిన 200 ప్రశ్నలతో కూడిన కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ జరుతుంది. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
చీరాల, గుంటూరు , కాకినాడ, కర్నూలు, నెల్లూరు , రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ , విశాఖపట్నం , హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
ఇక ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలుపెడితే తప్ప విజయం సాధించ వచ్చునని నిపుణులు అంటున్నారు. ఎప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఈ అవకాశాని వినియోగించుకుని ప్రభుత్వ ఉద్యోగం సాంధించాలని నిపుణులు అంటున్నారు.