ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఎట్టకేలకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. 269 పోస్టుల భర్తీని కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 269 పోస్టుల భర్తీ కోసం విభాగాల వారీగా పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్-4, నాన్ గెజిటెడ్, లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఆయుర్వేద, హోమియో వైద్యుల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వెబ్ సైట్ లో విడుదల చేశారు ఏపీపీఎస్సీ కార్యదర్శి అరుణ్ కుమార్. దీంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఏ ఏ విభాగాల్లో పోస్టులు పడ్డాయి? ఏ ఏ తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలి? ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? అనే వివరాలు తెలియని వారు ఉంటే ఓ లుక్కేయండి.