రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడితే కానీ ఆ దంపతులకు పూటగడవదు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని చదును చేసుకుంటూ ఈ దంపతులు వ్యవసాయం చేస్తున్నారు. ఇక రోజులాగే ఆ భార్యాభర్తలు పొలానికి వెళ్లారు. చేయాల్సిన పనులకు సిద్దమవుతూ భర్త అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పటి వరకు నాతో పాటు ఉన్న భార్య ఎక్కడికెళ్లిందంటూ భర్త అటు ఇటు వెతికాడు. ఎంతకు కూడా భార్య ఆచూకి దొరకలేదు. దీంతో ఖంగారు పడ్డ భర్త వీరి పొలంలో ఉన్న గుడిసెలోకి తొంగి చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. భార్యను ఆ స్థితిలో చూసి తట్టుకోలేని భర్త కన్నీటి పర్యంతమై గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఆ వ్యక్తి అరుపులు విన్న స్థానికులు పరుగు పరుగున వచ్చారు. అసలు ఆ గుడిసెలో అతని భార్యకు ఏమైంది? భర్త గుండెలు పగిలేలా ఏడ్చాల్సిన కారణం ఏంటనే పూర్తి ఇప్పుడు తెలుసుకుందాం.
అది గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం బిజ్వారం. ఇదే గ్రామానికి చెందిన వ్యక్తితో జ్యోతి (22)కి గతంలో వివాహం జరిగింది. ఊళ్లో ఈ దంపతులకు పొలంలో ఉండడంతో వ్యవసాయం చేసేవారు. అయితే రోజు లాగే ఈ దంపతులు శుక్రవారం పొలానికి వచ్చారు. చేయాల్సిన పనులకు ఇద్దరు రెడీ అవుతున్నారు. అయితే జ్యోతి ఫోన్ లో ఛార్జింగ్ లేకపోవడంతో పొలంలోని గుడిసెలోకి ఛార్జింగ్ పెట్టేందుకు వెళ్లింది. అయితే జ్యోతి సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెడుతుడగా ప్రమాదవశాత్తు జ్యోతి కరెంట్ షాక్ కు గురైంది. ఈ ప్రమాదంలో జ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
ఇక చాలా సమయం అయినా జ్యోతి కనిపించకపోవడంతో భర్త అటు ఇటు వెతికాడు. ఎంతకు కూడా భార్య జ్యోతి ఆచూకి కనిపించలేదు. దీంతో భర్త ఖంగారుపడి గుడెసిలోకి వెళ్లి చూడగా భార్య కరెంట్ షాక్ కు గురై ప్రాణాలు విడిచిందని తెలుసుకున్నాడు. పట్టపగలు ఇంతటి దారుణం జరగడంతో భర్త కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ వార్త తెలుసుకున్న జ్యోతి కుటుంబ సభ్యులు కంట కన్నీరు ఆగడం లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.