దేశంలో జరుగుతున్న అత్యాచార దాడులను చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు కొందరు దుర్మార్గులు విర్రవీగి ప్రవర్తిస్తూ అడ్డగోలుగా అత్యాచార దాడులకు కాలుదువుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే జార్ఖండ్ లో చోటు చేసుకుంది. భర్త కళ్ల ముందే ఆరుగురు దుండగులు భార్యపై సామూహిక అత్యాచారం చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్ పలామ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు.
ఇటీవల ఓ రాత్రి ఈ భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకోవడంతో గొడవ తీవ్ర రూపం దాల్చింది. దీంతో కోపంతో ఊగిపోయిన భార్య భర్తపై అలిగి అదే రాత్రి పుట్టింటికి వెళ్లేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లింది. దీంతో ఖంగుతిన్న భర్త తన బంధువుడిని ఒకరిని వెంటపెట్టుకుని రాత్రంత వెతికాడు. ఎట్టకేలకు అతని భార్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా భర్త పట్టుకుని సముదాయించి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే అటుగా రోడ్డుపై ఆరుగురు దుండగులు వాహనాలపై వచ్చారు.
రోడ్డుపై ఉన్న ఆ మహిళను చూసిన ఈ కేటుగాళ్లు ఆగలేకపోయారు. వెంటనే వారి వద్దకు వెళ్ళి.., ఆ మహిళ భర్తను, అతని వెంట వచ్చిన వ్యక్తిని ఇద్దరిపై దాడి చేశారు. అనంతరం భర్త కళ్లముందే అతని భార్యపై ఆరుగురు దుండగులు ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆ దుర్మార్గులు ఆ మహిళను మరో ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికలు అంత గుమిగుడి ఏడుస్తున్న ఆ మహిళను ఆ దుండగుల నుంచి రక్షించి ఆస్పత్రికి తరలించారు. తర్వాత ఆ మహిళ తనపై జరిగిన దారుణాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.