వివాహేతర సంబంధాలు ఇప్పటికీ ఎన్నో కాపురాలను నాశనం చేశాయి. అయినా లెక్కచేయని కొందరు వ్యక్తులు అదే మాయలో పడిపోతూ.., చివరికి క్షణికావేశంలో ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. తాను అనుకున్నది వెంటనే కావాలనే ధోరణిలో ఓ ప్రియురాలు రెచ్చిపోయి ప్రవర్తించింది. కేవలం రూ.500 కోసం ప్రియురాలు ప్రియుడి ప్రాణాలు తీసేసింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ఈశ్వరయ్య, యాదమరి ప్రాంతానికి చెందిన లలిత. వీరిద్దరివి వేరు వేరు కాపురాలు. కాస్త పరిచయంతోనే వీరిద్దరూ వివాహేతర సంబంధానికి తెర తీశారు. భర్తక తెలియకుండా లలిత, భార్య కళ్లుగప్పి ఈశ్వరయ్య, ఇలా అప్పుడప్పుడు దొంగచాటున కలుసుకునేవారు. గత కొన్ని రోజల నుంచి వీరి వివాహేతర సంబంధం ఘనంగా వర్ధిల్లుతుంది. అయితే వీరిద్దరూ ఇటీవల చిత్తూరులోని ఓ లాడ్జీలో అడుగుపెట్టారు. వెళ్లిన కొంతసేపటి వరకు బాగానే ఉన్నారు. కట్ చేస్తే ప్రియురాలి చేతిలో ప్రియుడు హతమయ్యాడు.
అయితే ఎంతసేపటికి వీరిద్దరూ బయటకు రాకపోవడంతో లాడ్జ్ నిర్వాహకులకు అనుమానం వచ్చింది. వెంటనే డోర్ బద్దలు కొట్టి చూడగా ప్రియుడు రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నాడు. నిర్వహకులు లలితను ప్రశ్నించగా.. రూ.500 కోసం ప్రియుడిని హత్య చేశానని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో వెంటనే లాడ్జ్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అరెస్ట్ చేశారు. అయితే ప్రియురాలు ప్రియుడిని డబ్బుల కోసమే హత్య చేసిందా? లేక మరేదైనా కారణం దాగి ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. రూ.500 కోసం ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.