నేటి కాలంలో టెక్నాలజీ ద్వారా ఫేమస్ అయ్యేందుకు యువత కొత్తకొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా తమకు తోచిన రీతిలో వినూత్నంగా ఆలోచిస్తూ వీడియోలు చేస్తున్నారు. లైక్లు వస్తాయని దీంతో ఫేమస్ అయిపోవచ్చనే బ్రమలో దేనికైన తెగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని పాతబస్తీకి చెందిన ఓ యువకుడు దారుణంగా వ్యవహరించాడు. బతికున్న పాముని కసకస నమిలి తిన్నాడు.
ఇక దీంతో ఆగకుండా పాపులారిటీ కోసం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు అంతా ఆ యువకుడిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక ట్విట్టర్లో కొందరు వ్యక్తులు తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. గతంలో ఈ యువకుడు ఇలాంటి ఎన్నో వికృత చేష్టలు చేస్తూ పోలీసులకు సైతం చిక్కాడట. ఓ భవనం నుంచి కుక్కలను కిందకు తోసేయటంతో వంటి కేసుల్లో పోలీసులు చిక్కాడు ఈ కేటుగాడు. అయినా బుద్ది మార్చుకోలేదు మనోడు. దీంతో ఈ యువకుడిపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఇలా జంతువులను హింసిస్తుడటంతో అతడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.