బిగ్ బాస్ 6.. గత సీజన్లతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే తొలి రెండు వారాలు చప్పగా సాగింది. వీకెండ్ ఎపిసోడ్ లో నాగ్ వచ్చి, హౌస్ మేట్స్ అందరినీ ఆడుకునే సరికి అందరూ అలెర్ట్ అయిపోయారు. ఇక ఆడకపోతే కష్టమే అనుకుని గొడవలు, రచ్చ చేయడం మొదలుపెట్టారు. తాజాగా సోమవారం జరిగిన నామినేషన్సే దీనికి బెస్ట్ ఉదాహరణ. అంతకంటే ముందు ఓ సందర్భంలో ఆరోహి.. హౌస్ మేట్స్ పరువు తీసినంత మాట ఆనేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇస్మార్ట్ అంజలి అలియాస్ ఆరోహి బిగ్ బాస్ హౌసులో మెల్లమెల్లగా పుంజుకుంటోంది. నామినేషన్స్ లో ఉన్నాసరే తన గేమ్ తను ఆడుతూ.. ఇతర హౌస్ మేట్స్ కంటే బెటర్ గా ఫెర్మార్మ్ చేస్తోంది. ఈ వారం కూడా 10 మంది నామినేట్ కాగా… అందులో ఆరోహి కూడా ఉంది. శీసత్య, బాలాదిత్య, కీర్తి, అర్జున్, రాజ్.. ఆరోహిని నామినేట్ చేసిన సభ్యులు. మరి ఈ వారం ఆమె ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలంటే గేమ్స్ లో బాగా ఫెర్మార్మ్ చేయాల్సి ఉంటుంది. చూడాలి ఏం జరుగుతుందో?
మరోవైపు నామినేషన్ ప్రక్రియ మొదలవకముందు.. అంటే ముందురోజు రాత్రి కెప్టెన్ రాజశేఖర్ తో ఆరోహి గొడవ పెట్టుకుంది. నిద్ర పంచాయతీ కోసం ఆరోహి-రాజ్ మధ్య ఇష్యూ జరగ్గా.. దీన్ని బాలాదిత్య వచ్చి క్లియర్ చేశాడు. తర్వాతి రోజు ఉదయం.. ఆరోహి-వాసంతి నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు. హౌసులో చాలామంది డిఫరెంట్ గా ఉన్నారని, వారి ఫెర్ఫార్మెన్స్ తట్టుకోలేకపోతున్నానని ఆరోహి చెప్పింది. ఇక ఆర్జే సూర్య దగ్గరకు వెళ్లి.. హౌస్ మేట్స్ అందరి పరువు తీసేసింది. ఇంట్లో ఉన్న చాలామందికి ఆడాలనే కసి లేదని, ఎంత అరిచినా సరే రేవంత్.. గేమ్స్ లో అదరగొడుతున్నాడని చెప్పింది. మరి ఆరోహి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్ లో గీతూ ఓవర్ యాక్షన్! పేద ప్రజలపై కామెంట్స్!