కదులుతున్న ట్రైన్ లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు.. పురుడు పోసి టాక్ ఆఫ్ ది సొసైటీగా నిలిచారు వైజాగ్ గీతం యూనివర్సిటీ మెడికల్ స్టూడెంట్ స్వాతి రెడ్డి. ఆ మహిళకు పండంటి ఆడ బిడ్డ జన్మించింది. మెడికల్ స్టూడెంట్ అయి ఉండి కూడా ఎలాంటి భయం లేకుండా పురుడు పోయడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. ఆమె చేసిన సహాయానికి, ధైర్య సాహసానికి అభినందిస్తున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి ప్రసవం చేసినప్పటి నుంచి ఆడ బిడ్డను హాస్పిటల్ లో చేర్చి సురక్షితం అని డాక్టర్లు చెప్పేంత వరకూ ఆమె కుటుంబ సభ్యులతోనే ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే ఆమె ఈ పని చేసినప్పుడు చాలా భయపడ్డానని, ఆ సిచ్యువేషన్ లో చాలా టెన్షన్ పడ్డానని ఆమె వెల్లడించారు. పాజిటివ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి అందరూ ప్రశంసిస్తున్నారు, అదే నెగిటివ్ వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని, అందుకే ఆమె భయపడినట్లు చెప్పుకొచ్చారు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె విజయవాడలో ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఏం జరిగింది? తాను ఈ డెలివరీ ఎలా చేశారో? ప్రతీది వివరించారు. మరి డాక్టర్ కాకుండానే డాక్టర్ లా మొదటి ఆపరేషన్ ని (సహజ పురుడుని) విజయవంతంగా చేసిన ఈ కాబోయే డాక్టర్ ఇంకేమంటున్నారో ఆమె మాటల్లోనే వినండి. వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.