కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు మరోసారి ఏపి కైవసం చేసుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ కి సంబంధించి జాతీయ అవార్డు తిరుపతి కార్పోరేషన్ దక్కించుకోగా.. సీఎం సొంత నియోజకవర్గం అయిన పులివెందుల మున్సిపాలిటికి మరో అవార్డు కైవసం చేసుకుంది. అలాగే ఈ అవార్డులు విజయవాడ, విశాఖ, పుంగనూర్, సాలూరు కార్పోరేషన్లు కూడా దక్కించుకున్నాయి.
అక్టోబర్ 2న ఈ అవార్డులు నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రధానం చేయనున్నారు. గత ఏడాది ఏపికి ఆరు అవార్డులు రావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా స్వచ్ఛ భారత్ పై దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ.. గ్రామీణ, పట్టణాభివృద్ది కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు.
స్వచ్ఛ భారత్ లో భాంగా పలు కార్పోరేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ ఉండటం వల్లనే ఏపికి అవార్డు దక్కాయని అంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు, పారదర్శకత పాలనకు అద్దం పడుతుందని అంటున్నారు. అందరి సమీష్టి కృషితో పల్లె ప్రగతి సాధిస్తూ.. అంతటా పచ్చదనం తీసుకు వస్తూ ఏపి మరిన్ని అవార్డులు కైవసం చేసుకునేందుకు సిద్దమవుతుందని సీఎం జగన్ సంతోషం వ్యక్తి చేశారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.