అవును.. చెట్టంత మనిషిని రొయ్య కొద్దిసేపట్లో ముచ్చెమటలు పట్టించింది. ఏకంగా అతని ముక్కులోకే దూరి ఊపిరి సలపకుండా చేసి ఒక్కసారిగా ఝలక్ ఇచ్చింది. తాజాగా పశ్చిమగోదావారి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం పరిసర ప్రాంతం. ఇక్కడే ఓ రైతు రొయ్యల చెరువులో దిగి పట్టుబడి చేస్తున్నాడు. అయితే ఈ సమయంలో ఓ రొయ్య ఎగిరి వేగంగా అతడి ముక్కులోకి దూరింది.
ఇది కూడా చదవండి: Video: జాతి వైరం మరచి.. పులి పిల్లలకు తల్లి ప్రేమను పంచుతున్న చింపాజి! వీడియో వైరల్
దీంతో అతను ముక్కులోకి దూరిన రొయ్యను విదిలించే ప్రయత్నం చేశాడు. అయినా కూడా అది కింద పడకుండా అతనికి ఊపిరాడకుండా చేసి ముప్పితిప్పలు పెట్టింది. దీంతో వెంటనే స్పందించిన తోటి రైతులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి ఎండోస్కోపీ ద్వారా ముక్కులోకి ఇరుక్కుపోయిన ఆ రొయ్యను చాకచక్యంగా బయటకు తీశారు. బయటకు తీసినా తర్వాత కూడా ఆ రొయ్య ఇంకా బతికే ఉండడం విశేషం. వెంటనే అతనిని ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.