ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద భారత టాప్ రెజ్లర్లు ధర్నాకు దిగడం హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంలో చాలా మంది ప్రముఖులు, సామాన్యులు స్పందిస్తున్నారు. రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ, వారికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
స్టార్ రెజర్లు, కామన్ వెల్త్ గేమ్స్, ఒలంపిక్స్ పతాక విజేతలు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తో పాటు మరో 30 మంది కుస్తీ వీరులు బుధవారం ధర్నాకు దిగారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజెపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నాలుగు గంటల పాటు నిరసన చేపట్టారు. ఈ ధర్నా ప్రభుత్వానికి, స్పోర్ట్స్ అథారిటీకి వ్యతిరేకంగా కాదని […]