ఇటీవల రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనపై ఎంపీగా కూడా అనర్హత వేటు పడింది. ఈ విషయాలపై రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం చూశాం. అయితే ఆ సందర్భంలో వీర సావర్కర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున రాజకీయ చర్చకు తెర లేపాయి.
ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రజలను పలకరించుకుంటూ వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. మహారాష్ట్ర అకోలాలో గురువారం మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. స్వాతంత్య్ర పోరాటయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలానే స్థానికుల మనోభావాలు దెబ్బతీశారని రాహుల్ గాంధీపై బాలాసాహెబంచి శివసేన నాయకురాలు వందన సుహాస్ డోంగ్రే గురువారం థానే నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు […]
భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. ఉదయం తిట్టుకుని సాయంత్రానికి మాట్లాడుకునే భార్యాభర్తలు లేకపోలేదు. ఇంకొందరు భార్యాభర్తలు మాత్రం క్షణికావేశంలో హత్యలు లేదా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అయితే ఓ భార్యాభర్తలకు ఓ చిన్న గొడవ జరిగింది. ఇదే కోపంలో భర్త.. చచ్చిపోతున్నానని భార్యను బయపెట్టాలనుకున్నాడు. కానీ చివరికి ప్రమాదవశాత్తులో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల ముంబాయిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబాయిలోని విరార్ వెస్ట్ వీర్ […]