మార్కెట్లో సామాన్యులు కూరగాయలు కొనే పరిస్థితి లేనే లేదు. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాటా ధరలు కొండెక్కిన విషయం తెలిసిందే. అదే బాటలో ఉల్లి కూడా ఘాటెక్కనుంది.
సామన్య ప్రజలకి టమాట, పెట్రోల్ పరుగు పందె పెట్టుకున్నాయా అన్నట్లుంది వాటి ధరల పెరుగుదలను చూస్తుంటే. ఇప్పటి వరకు తాబేలు నడక లాగా ఉన్న టమాట ధర అమాంతం కుందేలు లాగా పరిగెడుతుంది. పెట్రోల్,టమాట రెండు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. వీటిల్లో ఒకటి లేకపోతే ముందుకు సాగలేము.. మరొకటి ఉండకపోతే నోటికి ముద్ద పోదు. ఈ రెండిటి మధ్యలో సామన్యుడు అల్లాడుతున్నాడు. ప్రస్తుతం టమోటా ధర 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. తమిళనాడులో అయితే 150 […]