ఎంఎస్ చదివేందుకు కెనడా వెళ్ళాడు. బాగా చదివి చదువు పూర్తి చేశాడు. ఉద్యోగం కూడా సంపాదించాడు. రెండు నెలల్లో వస్తా అని చెప్పాడు. అంతలోనే మృత్యువు ఆ యువకుడ్ని కౌగిలించుకుంది. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు.
విదేశంలో మరో తెలుగు విద్యార్ధి బలయ్యాడు. ఇటీవలే ఆంధ్రాకు చెందిన వీర సాయిష్ అనే విద్యార్ధి అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ చదువు కోసం వెళ్లిన యువకుడు డాక్టర్గా తిరిగొస్తాడనుకుంటే విగతజీవిగా తిరిగొస్తున్నాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించిన అమ్మ, నాన్నల పేరు నిలబెట్టాలని, వారిని బాగా చూసుకోవాలని కలలు కనే యువకుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసమని విదేశాలకు వెళ్లే యువకులను మృత్యువు ఏదో రూపంలో వెంటాడుతోంది. ఒక తెలుగు యువకుడు అమెరికాలో జరిగిన కాల్పుల్లో మరణించాడు.
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారు నేటి యువత. అయితే విదేశాలకు వెళ్లాక వీరి లక్ష్యాలకు అడ్డుపడుతున్నాయి అక్కడి అలవాట్లు, పద్ధతులు. వాటిని అలవర్చుకుని స్వేచ్ఛా జీవనానికి అలవాటు పడుతున్నారు. విచ్చలవిడిగా శృంగారం, ఇతర వ్యవసనాలకు లోను అవుతున్నారు. తాజాగా ఓ తెలుగు కుర్రాడు ఈ అలవాట్లకు లోనై ..
ఖమ్మం యువకుడు, డాక్టర్ హర్షవర్ధన్ మరణం పట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, నెటిజన్స్ అందరూ భావోద్వేగానికి గురవుతున్నారు. అతని గురించి చదువుతుంటే, వింటుంటే ఇంత మంచి మనిషా అని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అంతలా అందరి హృదయాలను గెలుచుకున్న హర్షవర్ధన్ గురించి అతని స్నేహితురాలు సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చనిపోయే ముందు తనకు కాల్ చేశాడని.. కానీ లిఫ్ట్ చేయలేదని ఆమె బాధపడ్డారు.
తన చావు ఎప్పుడు వస్తుందో ముందే తెలిసిపోయింది. కానీ భయపడలేదు. ఎవరినీ భయపెట్టలేదు. చనిపోయే చివరి రోజుల్లో కూడా తన వైద్య వృత్తిని కొనసాగించారు. వందకు పైగా వృద్ధులకు ఉచిత చికిత్స అందించారు. వారితో వైద్యుడిగా కాకుండా ఒక స్నేహితుడిగా మెలిగారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి రోగులతో ఎలా అయితే ఉన్నారో అలా ఈ హర్షవర్ధన్ వృద్ధులతో మెలిగారు. చనిపోయే ముందు రోజు ఐతే వారితోనే ఉన్నాడు. వాళ్ళని ఆరోజు..
కొడుకుకి జ్వరం అని తెలిస్తేనే విలవిలలాడిపోయే తల్లిదండ్రులు క్యాన్సర్ అని తెలిస్తే చూస్తూ ఎలా ఉండగలరు. కొడుకు ఎంత దూరాన ఉన్నా సరే వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారు. అలా ఖమ్మం యువకుడు అయిన హర్షవర్ధన్ తల్లిదండ్రులు కూడా తన కొడుకు కోసం ఆస్ట్రేలియా వెళ్లాలని అనుకున్నారు. కానీ కొడుకు అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే?
తన శవపేటికను తనే తయారు చేయించుకునే పరిస్థితి ఎవరికీ రాదు. అసలు అంత ధైర్యం కూడా ఉండదు. అలాంటిది ఖమ్మం యువకుడు హర్షవర్ధన్ ఎంత ధైర్యంగా శవపేటికను తయారు చేయించుకున్నాడో తలచుకుంటేనే ఏడుపొస్తుంది. అతని గురించి తన తండ్రి చెప్తుంటే ఇంత మంచోడా అని అనిపిస్తుంది. ఇంత మంచి మనిషికా చావు వచ్చింది అని అనిపిస్తుంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్ తో ఖమ్మం నగరానికి చెందిన హర్షవర్ధన్ అనే యువకుడు ఆస్ట్రేలియాలో మరణించిన సంగతి తెలిసిందే. తను చనిపోతున్నా అని తెలిసి తన మృతదేహాన్ని భారతదేశానికి తీసుకెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు తనే చేసుకున్నాడు. అంతేకాదు భార్యకు విడాకులు ఇచ్చి ఆమె కోసం ఎన్ని చేయాలో అన్నీ చేసి వెళ్ళిపోయాడు.
ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ చావు అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. దానికి ఆ యువకుడు భయపడకుండా స్వాగతం పలికాడు. తను చనిపోయాక తన మృతదేహాన్ని స్వదేశానికి తీసుకెళ్లేలా అక్కడ ప్రభుత్వ అనుమతులు తీసుకుని అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. తాను ఆస్ట్రేలియాలో చనిపోతే తన మృతదేహాన్ని ఇండియా రప్పించడం కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం తానే దగ్గరుండి తన చావు తర్వాత మృతదేహాన్ని భారత్ కు తరలించే ఏర్పాట్లు చేసుకున్నాడు. కన్నీళ్లు పెట్టించే ఈ గాథ ఖమ్మం నగరానికి చెందిన యువకుడిది.