రోడ్డు ప్రమాదాలకు కారణం.. అతివేగం.. నిర్లక్ష్యం. అతివేగంతో ఊహించని ప్రమాదాలు జరిగి తీరని నష్టం వాటిల్లుతుంది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ద్వారా కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే వీటితోపాటుగా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కూడా సామాన్యుల ప్రాణాలను బలితీసుకుంటుంది.
ఆవేశం అనర్థాలకు దారి తీస్తుంది. స్థిమితంగా ఆలోచన చేయాల్సిన సమయంలో కోపంతో రగిలిపోయి క్షణికంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుటుంబం అన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని అధిగమించితే.. ఆ ఇల్లు స్వర్గాన్ని తలపిస్తుంది.
మానవుల్లో పురుషులు, స్త్రీలే కాకుండా ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. వీరిని దేవతా స్వరూపులుగా భావిస్తారు. వాస్తవానికి మిగిలినవారితో పోలిస్తే వీరి పట్ల వివక్షత ఎక్కువ. వీరిని అస్సలు మనుషుల్లాగానే చూడరు. ఇక వీరిని పనుల్లో పెట్టుకునేందుకు వెనకాడుతుంటారు.
సమాజంలో డబ్బులు సంపాదించుటకు కొందరు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా మోసాలకు తెగిస్తున్నారు. వారు తమ అవసరాలకు డబ్బులు సమకూర్చుకోవడమే కాకుండా దారుణాలకు తెగబడుతున్నారు.
ఇక్కడ చాలా మంది టెకీలు ఉద్యోగాలు పోయి రోడ్డున పడుతుంటే ఈ కుర్రాడు మాత్రం పెద్ద కంపెనీలో జాబ్ కొట్టేశాడు. అది కూడా 14 ఏళ్ల వయసులో. ఈ వయసులో గట్టిగా కంప్యూటర్ గురించే తెలియదు 90స్ బ్యాచ్ కి. అలాంటిది ఈ కుర్రాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిపోయాడు.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ క్రైం కూడా పెరిగిపోతున్నది. అపరిచిత కాల్స్ ద్వారా, టెక్ట్స్ మెసేజెస్ ద్వారా వ్యక్తులను లేదా సంస్థలను బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్ లైన్ లో గిఫ్టుల పేరుతో కూడా ఛీటింగ్ చేస్తున్నారు సైబర్ నేరస్థులు. ఇప్పుడు ఇంకో కొత్త రకం మోసం బయటపడింది. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలకు లైకులు కొడితే చాలు అని సైబర్ నేరగాళ్లు నమ్మబలికి డబ్బు దోచుకున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. పలు కంపెనీలు ఖర్చుల భారం తగ్గించుకునేందుకు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నారు. కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయ్యింది.. ఈ నేపథ్యంలోనే పలు కంపెనీలు ఉద్యోగుల విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు కొత్త కొత్త దారులను వెతుకుతున్నారు. తప్పు చేసినా దొరక్కుండా ఉండేందుకు టెక్నాలజీని కూడా విరివిగా వినియోగిస్తున్నారు.
ఆయన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీరు. నెల అయితే చాలు.. రూ. లక్షల్లో జీతం వచ్చి పడుతుంది. అయినా అతనిలో ఏదో తెలియని అసంతృప్తి. ఉద్యోగంలో భాగంగా విదేశాల్లో ఉన్న మనసంతా సొంతూరిపైనే ఉండేది. అందుకే చివరకు లక్షల జీతం వదులుకుని వ్యవసాయంలోకి అడుగు పెట్టాడు ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీరు.
ఈ మధ్యకాలంలో చాలా మంది ఉద్యోగులు సొంతంగా బిజినెస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలానే మరికొందరు ఉద్యోగులు వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వ్యవసాయంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. వ్యవసాయాన్ని సులభమైన పద్ధతులతో చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు వ్యవసాయంలోకి దిగి.. లక్షల్లో సంపాదించిన ఘటనలు మనం అనేకం చూశాం. అయితే వారి వారి ఆలోచనకు తగ్గినట్లు వివిధ రకాల పంటలపై ఆసక్తి చూపిస్తుంటారు. వరి, కూరగాయలు, […]