ఐపీఎల్ అనగానే అందరిలో ఒక ఉత్కంఠ, ఉత్సాహం ఉంటాయి. ఐపీఎల్ లో రాణిస్తే అంతర్జాతీయ క్రికెట్ కు దారి సుగుమం అవుతుంది. అలాంటి టోర్నమెంట్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానురాను ఐపీఎల్ స్థాయి దిగజారిపోతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాకిస్థాన్ సూపర్ లీగ్.. క్రికెట్ లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. నిన్ననే దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ రిలీ రోసో రికార్డు శతకంతో కదం తొక్కగా.. ఈ రోజు ఆ రికార్డు సెంచరీని బ్రేక్ చేశాడు ఉస్మాన్ ఖాన్.
పాకిస్తాన్ క్రికెట్ లీగ్ (పీఎస్ఎల్)లో సంచలనాలు నమోదవుతున్నాయి. బౌండరీలు చిన్నగా ఉండటం, పిచ్లు బ్యాటింగ్కు అనుకూలిస్తుండంటంతో బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. 230.. 240 పరుగుల లక్ష్యాలను సైతం అలవోకగా ఛేదిస్తున్నారు. రికార్డు స్థాయిలో బౌండరీలు నమోదవుతూ.. మునుపటి రికార్డులు కనుమరుగవుతున్నాయి.
స్టార్ క్రికెటర్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి భారీ చోరీకి పాల్పడ్డారు. ఆ ఇంటి నుంచి దాదాపు రూ. 80 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, విలువైన వస్తువులు దోచుకెళ్లారు. ఈ ఘటన మార్చి 5న జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో భారీ స్కోర్లు నమోదమవుతున్నాయి. బౌండరీలు చిన్నగా ఉండటం, పిచ్లు బ్యాటింగ్కు అనుకులిస్తుండటంతో బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. బంతి బంతికి బౌండరీలు కొడుతూ అభిమానులకు అసలు మజాను పంచుతున్నారు. బుధవారం క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ మధ్య జరిగిన మ్యాచ్లో బాబర్ ఆజం, జాసన్ రాయ్ సెంచరీలతో మెరవగా, తాజాగా లాహోర్ క్వాలండర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్లో పాక్ సీనియర్ బ్యాటర్ ఫఖర్ జమాన్ విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ వెటరన్ బ్యాటర్, నలుమూలలా బౌండరీలు బాదుతూ స్టేడియం దద్దరిల్లేలా చేసాడు.
ఇంగ్లాండ్ బ్యాటర్ జాసన్ రాయ్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. ప్రత్యర్థి జట్టు నిర్ధేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఛేదించి వారి ఆశలపై నీళ్లు చల్లాడు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌలర్లపై ఎదురుదాడికి రాయ్.. పెషావర్ జల్మీ బౌలర్లకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేశాడు. రాయ్ ధాటికి.. ముగ్గురు పాక్ బౌలర్లు అర్ధ సెంచరీలు చేయటం గమనార్హం.
పాక్ సూపర్ లీగ్ లో నిజంగా ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఆజమ్ ఖాన్ అనే బ్యాటర్.. తన తండ్రి కోచింగ్ ఇస్తున్న జట్టుపై దంచికొట్టే బ్యాటింగ్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుత క్రికెట్ లో విరాట్ కోహ్లీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా రికార్డ్స్ నెలకొల్పాడు కాబట్టి. అయితే ఓ విషయంలో మాత్రం బాబర్ ఆజమ్ బెటర్ అని స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
టీ20 వరల్డ్ కప్ 2022లో విరాట్ కోహ్లీకి రెండు భారీ సిక్సులు సమర్పించుకున్న హరీస్ రౌఫ్ గుర్తున్నాడుగా.. ఇప్పుడు మరోసారి ఇంగ్లండ్ బ్యాటర్ జాసన్ రాయ్కి ఏకంగా మూడు సిక్సులు సమర్పించుకున్నాడు.