ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. పదిన్నర గంటలకు పైగా ఈడీ అధికారులు కవితను విచారించారు. మరోసారి ఈడీ విచారణకు హాజరుకావాలని కవితకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు కూడా ఉండటంతో ఆమెకు నోటీసులు పంపించింది ఈడీ. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ రానున్నారు.
ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో BRS మీటింగ్ లో కవితను రేపు అరెస్ట్ చేయెుచ్చు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. దాంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.
హైదరాబాద్- సేవ చేయడానికి ప్రాంతాలు, సరిహద్దులు ఉండవని.. మంచి మనసు ఉంటే చాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరూపించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ చిన్నారికి అనారోగ్యం ఉంటే కవిత వెంటనే స్పందించింది. ఆ చిన్నారి వెన్నెముక ఆపరేషన్కు చేయూతనిచ్చి వారి కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపారు ఎమ్మెల్సీ కవిత. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన పదకొండు ఏళ్ల చిమ్మల జ్ఞాపిక అనే చిన్నారి వెన్నెముక సంబంధిత వ్యాధితో హైదరాబాద్ లోని […]