కర్ణాటకలోని చిత్తాపుర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే.. బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో అక్రమాలు జరిగాయని, అలానే ఉద్యోగాల పేరుతో మహిళలను శారీరక కోరిక తీర్చమని అధికారులు అడుగుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగిందని, ప్రభుత్వ ఉద్యోగాలని అమ్ముతున్నారని ఖర్గే ఆరోపించారు. కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్లో 1492 ఉద్యోగాలను భర్తీ చేశారని, ఈ ప్రక్రియలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అధికారుల […]
పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు హైదరాబాద్ రావాలని ఆహ్వానిస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ పెద్ద రాజకీయ వేడిని రాజేసింది. ఆ ట్వీట్ పై కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. హైదరాబాద్ కు ఆహ్వానిస్తూ కేటీఆర్ ట్వీట్ చేయడం హాస్యాస్పదం అంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపార వేత్తలు బెంగళూరు వస్తుంటారని తెలిపారు. ‘అత్యధికంగా స్టార్టప్స్, యూనికాన్ సంస్థలున్న బెంగళూరు ఎక్కువ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. గత మూడేళ్లుగా ఆర్థికంగా ప్రగతి సాధిస్తోంది’ అంటూ బసవరాజు బొమ్మై వ్యాఖ్యానించారు. […]