తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వాటిని అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరేలా అమలు పరుస్తుంది. అందులో భాగంగా రైతుబంధు, రైతుబీమా కూడా ఉన్నవి. రైతులకు సంబంధించి తెలంగాణ సర్కార్ శుభవార్త తెలియజేసింది.
ఇంట్లో అమ్మాయి పుట్టిన వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆడపిల్లల భవిష్యతు కోసం రూ. 21 వేల రూపాయలను అందిస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ బస్సు కథ తన కొంప ముంచిందంటున్నాడు ఓ కర్ణాటక వాసి. బెంగళూరు బస్టాండులో ఓ వ్యక్తి తన తలను బస్సు టైరు కింద పెట్టి హల్ చల్ చేశాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలులోకి తెచ్చారు. పేదవారికోసం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తుంది. యువకులను కూడ ఆర్థికంగా ప్రోత్సహించేందుకు మరో పథకం ‘YSR లా నేస్తం’ ని తీసుకువచ్చింది. దీని ద్వారా నెలకు రూ. 5వేల స్టైఫండ్ ఏపీ ప్రభుత్వం యువ న్యాయవాదులకు అందిస్తోంది.
మీరు స్వయంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని అనుకుంటున్నారా? అయితే స్టాండప్ ఇండియా పథకంలో దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకోవడం ద్వారా మీరు రూ. 10 లక్షల నుంచి రూ. కోటి రూపాయల వరకూ ఋణం పొందవచ్చు. దాని కోసం ఏం చేయాలంటే?
వ్యవసాయంలో ట్రాక్టర్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ ను అద్దె కోసం తెచ్చుకుంటారు. కానీ గంటకు ఇంత అని చెప్పి కొంతమంది ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు రైతులకు నరకం చూపిస్తుంటారు. దీంతో రైతుల డబ్బంతా మన్నులో పోసినట్టే అవుతుంది. రైతుకి కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, సొంతంగా ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే బాగుణ్ణు అని. కానీ ట్రాక్టర్ కొనాలంటే ఆర్థిక స్థోమత చాలదు. అయితే అలాంటి రైతుల కోసం ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. సగం ధరకే ట్రాక్టర్ ని కొనేందుకు సబ్సిడీ ఇస్తోంది.
ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రోత్సాహకంగా ప్రభుత్వాలు ఆయా పథకాల పేరుతో కొంత డబ్బుని ఇస్తుంటాయి. కుల వృత్తులు, చేతి వృత్తులు ఆధారంగా వివిధ పథకాల ద్వారా డబ్బుని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ పథకంలో చేరిన లబ్దిదారులకు గొర్రెలు స్వయంగా కొనుగోలు చేసుకునేందుకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో ఉన్న లబ్ధిదారులకు […]
కొంతమందికి ప్రతిభ ఉంటే డబ్బుండదు, కొంతమందికి డబ్బుంటే ప్రతిభ ఉండదు. డబ్బు ఉండి ప్రతిభ లేకపోయినా ఏదో రకంగా బతికేయచ్చు. కానీ ప్రతిభ ఉండి డబ్బు లేకపోతే మాత్రం అది వారి జీవితాలే కాదు సమాజం కూడా వెనకబడిపోవడానికి కారణమవుతుంది. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా చదువులో ప్రతిభ చూపించేవారికి ఆర్ధిక ప్రోత్సాహం ఉండాలి. అందుకే ప్రభుత్వాలు ప్రతిభ ఉండి ఆర్ధికంగా వెనకబడి ఉన్న వారి కోసం స్కాలర్ షిప్ లు అందిస్తున్నాయి. ఆర్థిక వైకల్యం […]
పెన్షన్ ఉంటే వృద్ధాప్యంలో ఉండదు ఏ టెన్షన్. వృద్ధులకు పెన్షన్ అనేది చాలా అవసరం. కొడుకులు చూస్తారో లేదో, కూతుర్లకు చూసే అవకాశం ఉంటుందో లేదో, అసలు చూద్దామన్నా చూసే ఆర్ధిక స్థోమత పిల్లలకి ఉంటుందో లేదో? ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలంటే పెన్షన్ చాలా ముఖ్యం. పట్టుదల ఉన్నా ఒంట్లో పట్టు ఉండని ఏజ్ అది. ఆ ఏజ్ లో సాధించాల్సింది పిల్లల్ని కాదు, అటల్ […]
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2022–23 సంవత్సరానికి సంబంధించి అర్హులైన ఎస్సీ పేద విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అందిస్తోంది. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు మాత్రమే ఇందుకు అర్హులు. పేద విద్యార్థుల ఉన్నత చదువులే లక్ష్యంగా ప్రభుత్వం ఈ స్కాలర్షిప్స్ అందిస్తోంది. చదువుతున్న కోర్సుల ఆధారంగా ప్రతి ఏడాది రూ. 2500 నుంచి రూ. 13,500 వరకు స్కాలర్షిప్ అందిస్తారు. ఇలా ఐదేళ్లలో మొత్తం 63 లక్షల మందికి చెల్లిస్తారు. అర్హతలు: […]