పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డి. శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం డీఎస్ ను సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు.
డి.శ్రీనివాస్.. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ధర్మపురి ఫ్యామిలీకి, రాష్ట్ర రాజకీయాల్లో డీఎస్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. YSR ఉన్నప్పుడు ఆయనే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడి గా ఉండి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ను రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చారు. అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో డీఎస్ కీలకంగా వ్యవహరించారు. ప్రత్యర్ధులపై మాటల సంధించటంలో డీఎస్ దిట్టా. తాజాగా YSR తనయ YS […]