టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో భద్రత, వ్యక్తిగత గోప్యత ఎంతో సన్నగిల్లుతోంది. ఇప్పటికే ఎన్నో సైబర్ అటాక్స్, డేటా చోరీలు జరిగాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఒక బిగ్ అలర్ట్ వచ్చింది. ఒక మాల్ వేర్ ఏకంగా ప్లే స్టోర్ లో ఉండే యాప్స్ ని ఇన్ ఫెక్ట్ చేసింది. అది కూడా 100 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్న యాప్స్ అవి.
పెరుగుతున్న టెక్నాలజీతో ఎవరి వ్యక్తిగత సమాచారం అంత భద్రం కాదని అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా రకాల హ్యాక్ లు, సైబర్ అటాక్స్ గురించి విన్నాం. అయితే ఇలాంటి అటాక్స్ విషయంలో ఐఫోన్లు చాలా భద్రంగా ఉంటాయని చెబుతుంటారు. కానీ, ఒక నివేదిక మాత్రం ఐఫోన్లే లక్ష్యంగా ఒక సైబర్ అటాక్ జరిగినట్లు చెబుతున్నారు.
చాట్ జపీటీ.. ఈ ఏఐ ఆధారిత టెక్నాలజీ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే గత రెండు నెలలుగా టెక్ రంగంలో ఇది ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రారంభమైన కేవలం రెండు నెలల వ్యవధిలోనే 100 మిలియన్ కు పైగా యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుంది. ఆ రికార్డులు చూస్తే ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ సంస్థలు కూడా బిత్తరపోయాయి. ఈ టెక్నాలజీ అన్ని రంగాలపై ప్రభావం చూపుతుందని అందరికీ అర్థమైంది. దీని ద్వారా మీరు కోడ్ […]
ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీతో బ్యాంక్ సేవలు బాగా సులభతరం అయ్యాయి. అలాగే ఆన్ లైన్ మోసాలు కూడా బాగా పెరిగిపోయాయి. అయితే అంతా ఏదో చదువురాని వాళ్లని, పల్లెటూర్లలో ఉండే వృద్ధులను మోసం చేస్తారని అంతా అనుకుంటారు. అయితే టెక్నాలజీ, సాఫ్ట్ వేర్లు, సరిపడినంత స్టాఫ్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఐసీసీలాంటి సంస్థను మోసం చేశారంటే నమ్ముతారా? అది కూడా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సార్లు మోసం చేశారు. అదికూడా దాదాపు రూ.20 […]
వాట్సాప్ సోషల్ మెసేజింగ్ యాప్ కి సంబంధించి డేటా భారీగా లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 50 కోట్ల వాట్సాప్ వినియోగదారుల నంబర్లు హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో భారత వాట్సాప్ వినియోగదారుల నంబర్లు కూడా ఉన్నట్టు సమాచారం. ఓ హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్ లో ఈ ఫోన్ నంబర్ల విక్రయానికి సంబంధించి ఒక ప్రకటన పెట్టినట్లు విదేశీ సైబర్ న్యూస్ కథనం పేర్కొంది. 48.7 కోట్ల వాట్సాప్ వినియోగదారుల మొబైల్ నంబర్లతో […]
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో.. సైబర్ నేరాల సంఖ్య కూడా అంతే వేగంగా విస్తరిస్తోంది. మారుతున్న సాంకేతికతకు అనుకూలంగా సైబర్ మోసగాళ్లు కూడా అప్డేట్ అవుతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో సామాన్యులను మోసం చేస్తున్నారు. తాజాగా కొందరు సైబర్ కేటగాళ్లు.. ఏకంగా గూగుల్ప్లే స్టోర్లోకి వెళ్లి.. నకిలీ యాప్స్ను అక్కడ చేర్చి.. సదరు యాప్స్ ద్వారా మాల్వేర్స్ని స్మార్ట్ఫోన్లలోకి పంపిస్తున్నారు. దాని ద్వారా యూజర్ల డేటాను దొంగిలస్తున్నారు. ఇది కూడా చదవండి: WhatsAppలో అవకతవకలు.. ఆందోళనలో యూజర్లు.. […]
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘ది కశ్మీర్ ఫైల్స్‘ సినిమాపై చర్చ జరుగుతోంది. 1990లలో కాశ్మీర్ లోయ నుండి పండిట్ల వలస నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీలో ‘సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్’గా నిలిచింది. అయితే.. కశ్మీర్ ఫైల్స్ మూవీని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్స్ కోసం వెతికే వారిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా నోయిడా అడిషనల్ డిప్యూటీ కమీషనర్ రణ్విజయ్ సింగ్.. ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా డౌన్లోడ్ కోసం జరుగుతున్న వాట్సాప్ మోసాలపై ప్రేక్షకులకు వార్నింగ్ […]
మీరు కంప్యూటర్, మొబైల్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? అయితే.. మీ కంప్యూటర్ లేదా మొబైల్ లలో మీరే సైబర్ దాడులకు చాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అవును.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఉన్న చిన్న చిన్న లోపాలు సైబర్ దాడులకు అవకాశంగా మారుతోంది. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) తెలిపింది. తాజాగా ఈ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం గూగుల్ క్రోమ్ […]