పోలీసులు ఎంతగా నిఘా పెడుతున్నా రోజు కేసులు బయటపడుతూనే ఉన్నప్పటికీ సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతూనే వున్నారు. హైదరాబాద్లో ఫారెస్ట్ ఆయిల్ పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. ఆయిల్ పేరుతో రూ.11 కోట్ల మేర బాధితులకు టోకరా పెట్టారు కేటుగాళ్లు. ఫేస్బుక్తో గీతా నారాయణ్ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు అమెరికాలో ఖరీదైన ఆయిల్ బిజినెస్ట్ చేస్తున్నట్లు నమ్మించారు. వ్యాక్సిన్ తయారయ్యే అగ్రో సీడ్ ఆయిల్ సప్లయ్ చేస్తామని నమ్మించారు. ఇది నిజమేనని […]
నేటి కాలంలో చదువుకున్న ప్రబుద్ధులే ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నారు. కష్టపడకుండా డబ్బు సంపాదించటం కోసం అనేక నేరాలు చేస్తున్నారు.లక్షలు కాజేసిన సైబర్ కేటుగాడు గ్రాసరీస్, ఫర్నిచర్ సేల్స్ పేరుతో జనాల్ని మోసం చేసాడు,ప్రముఖ వెబ్సైట్లలో చిన్న మార్పులు చేసి నకిలీ వెబ్సైట్ సృష్టించి,గ్రాసరీస్,ఫర్నిచర్ అమ్మకాల పేరుతో వందలాది మందిని బురిడీ కొట్టించాడు. లక్షలు దోచుకుంటున్న కేటుగాడి ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు.నిందితుడి నుంచి రెండు ల్యాప్టా్పలు, మూడు సెల్ఫోన్లు,20 డెబిట్ కార్డులు,ఆరు బ్యాంక్ పాస్బుక్లు, రూ.40 లక్షలు […]
కరోనా వల్ల వేల సంఖ్యలో ఆన్లైన్ కొనుగోళ్ల ఆర్డర్స్ చేస్తున్నారు. అదే స్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. కరోనా నివారణకు మూలికలు పనిచేస్తాయి అని నమ్మించి సైబర్ కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ‘గింగో’ అనే తైలంతో కరోనాను నివారించొచ్చని అది తమ వద్ద దొరుకుతుందని ప్రచారం చేసుకుంటూ హైదరాబాద్కు చెందిన ఓ ఫార్మా కంపెనీ ప్రతినిధిని అలాగే ఓ ఆయుర్వేదిక్ వైద్యురాలని నిండా ముంచారు నైజీరియన్ చీటర్స్. మెహదీపట్నంలో ఉంటున్న ఒక ఆయుర్వేదిక్ వైద్యురాలికి ఫోన్ చేసిన […]
సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు సంస్థలు, దుకాణాలు, ఫుడ్ డెలివరీ సంస్థలపై గురిపెట్టారు. ఆయా సంస్థల సర్వర్లపై చొరబడుతూ సమాచారాన్నంతా తస్కరిస్తున్నారు. వాటిని డార్క్నెట్, డీప్వెబ్ తదితర వెబ్సైట్లలో అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వాటిని విక్రయిస్తున్న కొందరు ఆ వివరాల సాయంతో వినియోగదారుల నుంచి రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ప్రజలను వినియోగ వస్తువులుగా భావిస్తున్న సైబర్ నేరస్థులు వారి వివరాలు సేకరించేందుకు సరైన రక్షణ వ్యవస్థలు లేని సర్వర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, మెట్రో […]
విదేశాల నుంచి ఏదో పార్సిల్ వచ్చిందని, అది కావాలంటే కొంత డబ్బు కట్టాలని మోసగాళ్లు ఒక మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్ లో ఉన్న లింక్ను క్లిక్ చేసిన తర్వాత క్రోమ్ యాప్ అప్డేట్ చేయమని కోరుతుంది. ఒకవేళ మీరు క్రోమ్ యాప్ అప్డేట్ చేస్తే ఇక అంతే సంగతులు. అప్డేట్ తర్వాత గూగుల్ క్రోమ్ మాల్వేర్ యాప్ లాగా మారిపోతుంది. తర్వాత ప్యాకేజీని డెలివరీ చేయడానికి క్రెడిట్ కార్డుల ద్వారా ఒకటి లేదా రెండు డాలర్లు […]
డిజటల్ ఆస్తులకు, సైబర్ నేరస్థులు ద్వారా పొంచివున్న ప్రమాదం, సైబర్ బీమా అవసరాన్ని సూచిస్తుంది. ఈ పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ, మాల్వేర్ దాడి, ఐటీ డేటా దొంగతనం, ఈమెయిల్ స్పూకింగ్, సైబర్ దోపిడి, సైబర్ స్టాకింగ్ వంటి 11 రకాల సైబర్ నేరలకు వ్యతిరేకంగా వ్యక్తులకు బీమా సౌకర్యాలను అందిస్తుంది. సైబర్ దాడి అనంతరం అయ్యే ఖర్చులను సైబర్ బీమా కవర్ చేస్తుంది. పాలసీ జాబితాలో పేర్కొన్న వివిధ రకాల […]
ప్రస్తుతం కోవిడ్ -19 పరిస్థితులను, ప్రజల భయాందోళలను సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఎస్ఎంఎస్ వర్మ్ అనే మాల్వేర్ ద్వారా సైబర్ కేటుగాళ్లు ఇండియాలోని ఆండ్రాయిడ్ వినియోగదారులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాల్వేర్ ప్రభావంతో కొందరు నెటిజన్లు నకిలీ కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వారి వ్యక్తిగత సమాచారం అంతా ఇచ్చేస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు వరదలా వచ్చే సోషల్ మీడియా/ఆన్లైన్ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్ […]