హైదరాబాద్- తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలిచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలను కఠినతరం చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. దీంతో ఇక రాష్ట్రంలో మరోసారి కరోనా ఆంక్షల దిశగా చర్యలు చేపడుతోందని తెలుస్తోంది. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలంటూ హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని […]
హైదరాబాద్- కరోనా మహమ్మారి సెంకడ్ వేవ్ తో వదిలిపోతుందని అంతా బావించారు. ధర్డ్ వేవ్ వస్తుందన్నదానిపై భిన్నమైన వాదనలు వినిపించాయి. మూడో దశ కరోనా వస్తుందని కొందరు, రాదని మరి కొందరు నిపుణులు చెబుతూ వస్తున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో కరోనా కొత్త వేరియంట్ వచ్చి మరోసారి ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది. అవును కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ మెల్ల మెల్లగా వాపిస్తోంది. నవంబర్ లో దక్షిణాఫ్రికా దేశంలో తొలిసారి వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్.. సైలెంట్ […]
న్యూ ఢిల్లీ- ఏ క్షణమైనా కరోనా మహమ్మారి మళ్లీ విజృంబించే ప్రమాదం ఉందని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శాస్త్రీయ సమాజం సిద్ధంగా, అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. డిఐపిఏఎస్ కు చెందిన సుమారు 25 మంది శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులను సోమవారం ఉపరాష్ట్రపతి తమ నివాసానికి ఆహ్వానించారు. వారిలో డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి కూడా ఉన్నారు. కరోనా చికిత్స, […]
హైదరాబాద్- కరోనా చికిత్స విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాకు సంబంధించిన వివిధ రకాల వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో చేరుస్తూ కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మొదటి దశలో కరోనా చికిత్సకు ఆరోగ్యశ్రీ ద్వార కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే అందిస్తారు. రెండో దశలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనాకు ఆరోగ్యశ్రీ ద్వార చికిత్స అందించనున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ […]