అమ్మిన వస్తువులో లోపాలు, మోసపూరితమైన వాణిజ్య పద్ధతులను అనుసరిస్తూ..నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కంపెనీలపై గతంలో అనేక పిటిషన్లు వినియోగ దారుల చట్టం కింద దాఖలయ్యాయి. పెద్ద కంపెనీలేమీ అతీతం కాదూ. తాాజాగా ఓ కార్ల కంపెనీ ఆ జాబితాలోకి చేరింది.
చాలా మంది ప్రయాణికులు చిల్లర విషయంలో గొడవ పడుతుంటారు. పెద్ద నోటు ఇచ్చినా, చిన్న నోట్లు ఇచ్చినా రూపాయి, 2 రూపాయల దగ్గర చిల్లర ఇవ్వాల్సి వస్తే కొంతమంది కండక్టర్లు ఇవ్వడానికి ఒప్పుకోరు. దిగేటప్పుడు ఇస్తాలే అని వెనుక రాసి ఇస్తారు. చాలా మందికి ఈ అనుభవం ఎదురై ఉంటుంది. అయితే మీకు తెలుసా? చిల్లర ఇవ్వకపోతే కోర్టులో కేసు వేసి నష్టపరిహారం పొందవచ్చునని.
ఏదైన వస్తువులు,సర్వీస్ విషయంలో వినియోగదారులకు అన్యాయం జరిగితే వినియోగదారుల ఫోరంకి వెళ్తారు. అయితే వినియోదారుడు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి..వారికి తగిన న్యాయం చేస్తారు. అలా ఇప్పటికే వినియోదారుల ఫోరంలు అనేక సంచలన తీర్పు ఇచ్చాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ వినియోదారుల ఫోరం ఓ క్యాబ్ సంస్థకు రూ.20 వేల జరిమాన విధించింది. క్యాబ్ బుక్ చేసుకున్న వ్యక్తికి సమయం వృథా చేస్తూ ఆలస్యంగా వచ్చినందు కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2018లో జరిగిన ఈఘటనపై విచారణలు […]