హిందువుల ఆరాధ్యదైవం శబరిమల అయ్యప్పస్వామి పుట్టుకను కించపరిచి ప్రజలు చేతిలో తన్నులు తిన్న తెలంగాణ నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేష్ కు ప్రమోషన్ వచ్చినట్లు తెలుస్తోంది. అతడి సేవలు మెచ్చి భారత నాస్తిక సమాజం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి లభించినట్లు కథనాలు వస్తున్నాయి.
వరంగల్ లో తనపై జరిగిన దాడిపై బైరి నరేష్ స్పందించాడు. మూఢనమ్మకాలు ఉండకూడదనేదే తన లక్ష్యమని కామెంట్లు చేశాడు. ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని, లైసెన్స్డ్ గన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
అయ్యప్ప స్వామి పుట్టుక, చరిత్రకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో నాస్తిక సంఘం అధ్యక్షుడు అయిన బైరి నరేష్ పై వరంగల్ లో దాడి చేశారు హిందూ సంఘ కార్యకర్తలు.