అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కుంభ వృష్టిగా వానలు దంచికొట్టాయి. నగరాలన్నీ జలమయమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. జన జీవనం అస్తవ్యస్థమైంది.
రోహిణి కార్తె రాకుండానే భానుడు భగ భగ మండుతున్నాడు. పొద్దునే సూర్యుడు చెమటలు కక్కిస్తున్నాడు. మధ్యాహ్నం వేళ బయటకు వచ్చేందుకు బెంబేలు పడుతున్నారు. పని ఉంటే తప్ప కాలు బయటపెట్టడం లేదు జనాలు. ఎండలు ఠారెత్తుతున్న సమయంలో తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది
ఓ వైపు ఎండలు మండిపడుతుంటే.. మరో వైపు వానలు దంచికొడుతున్నాయి. హమ్మయ్య అనుకునే లోపు మళ్లీ సూర్యుడు తన ప్రతాపాన్నిచూపిస్తున్నాడు. ఎన్నడూ లేని విధంగా ఈ వింత వాతావరణాన్ని చూసి ప్రజల్లో కూడా గందరగోళం ఏర్పడుతోంది. తాజా నంద్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.. అయితే
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేశారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకూ పొంచి ఉన్న ప్రమాదం గురించి కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ లో మాట్లాడారు. గోదావరి ఉదృతి, వరద సహాయక చర్యలపై సూచనలు చేశారు. గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయని..జూలై నెలలో రూ. 10 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద వచ్చిందని అన్నారు. 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని, ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందని అన్నారు. రేపు […]
అకాల వర్షాలతో చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా తిరుపతి, తిరుమల అయితే భారీ వర్షాలతో నదులను తలపించాయి. కొద్ది రోజులు ఊపిరి పీల్చుకున్న తర్వాత మళ్లీ వరుణుడి పంజా విసురుతున్నాడు. అల్పపీడన ధోరణి కారణంగా తిరుపతి, నెల్లూరులో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మరికొన్ని అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. House Collapsed at Bhavani Nagar, #Tirupati due to Heavy rains. pic.twitter.com/jLOX8dll55 — Andhra Pradesh Weatherman […]
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజకీయల్లో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నేతలు ఎప్పుడు ఎలా స్పందిస్తారో తెలియదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే సమయంలో జగన్ గాల్లోనే వచ్చి గాల్లోనే కలిసిపోతాడని చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవడంపై వస్తున్న విమర్శలకు సీఎం జగన్ చెక్ పెట్టారు. తన పర్యటన కారణంగా అధికార యంత్రాంగం చేస్తోన్న సహాయక కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడకూడదనే.. అందుకే వరద […]
తిరుమల- తిరుపతిలో ప్రజలు వర్షాలతో పడిన ఇక్కట్లు చూసి యావత్ రాష్ట్రమే కళ్లనీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతానికి వరుణుడు శాంతించాడని ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో తిరుపతిలో మరో వింత ఘటన జరిగింది. వాటర్ ట్యాంక్ లో దిగి మహళ శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ఆ ట్యాంక్ భూమి నుంచి పైకొచ్చింది. భయాందోళన చెందిన మహిళ కేకలు వేయడంతో ఆమె భర్త వచ్చి బయటకు తీశాడు. వివరాల్లోకి వెళితే.. తిరుపతి శ్రీకృష్ణానగర్ లో ఈ వింత జరిగింది. శుభ్రంచేస్తుండగా 25 అడుగుల […]
తిరుపతిలో మళ్లీ భారీ వర్షం కురిసింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో తిరుపతి ప్రజలు అల్లాడుతుంటే మరోసారి ఉపద్రవంలా భారీ వర్షం ముంచెత్తింది. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాయుగుండం ప్రభావంతో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుపతి నగరం సముద్రంలా మారింది. వర్షాలు కాస్త శాంతించాయి అనుకుంటే మరోసారి విరుచుకుపడ్డాడు వరుణుడు. తిరుపతిలో రోడ్లు కాలువల్లా మారాయి, కాలనీలు కుంటలను తలపిస్తున్నాయి. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు రెండు రోజులుగా వరద నీటిలోనే నానిపోతున్నారు. తిండి […]
అకాల వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. క్షణం క్షణం ప్రాణాలను అరచేత పెట్టుకుని బతుకుతున్న వారిని కొందరు తప్పుడు ప్రచారాలతో భయాందోళనకు గురి చేస్తున్నారు. సోమశిల డ్యామ్ తెగిపోయిందని ప్రచారాలు చేశారు. ఆ వదంతులతో నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో సాలుచింతల, స్టాబిడి కాలనీ ప్రాంత వాసులు హడలిపోయారు. చేతికి అందిన సామానులను చేత పట్టుకుని పరుగులు పెట్టారు. ముసలి వాళ్లు, చిన్న పిల్లలను తీసుకుని బతుకు జీవుడా […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వానలు వెంటాడుతున్నాయి. మూడు రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాలతో ఇంకా తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్ను మరో వాన గండం భయపెడుతోంది. ఈ మేరకు విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాబోవు 72 గంటల్లో ఏ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో తక్కువ ట్రోపోస్పియరిక్ స్థాయిల్లో సర్క్యులేషన్ ఉందని వాతావరణ నిపుణలు గుర్తించారు. రాబోయే నాలుగైదు రోజుల్లో […]