ఇటీవలే ఏపీ విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలు కొన్ని కుటుంబాల్లో విషాదాలు నింపాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని రాష్ట్ర వ్యాప్తంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.ఇలా వారు తీసుకున్న నిర్ణయం తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చారు. తాజాగా కడపలో కూడా విషాదం చోటుచేసుకుంది.