ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు సహా పలువురు భారతీయ విద్యార్థులకు బెదిరింపులు వెళ్లాయి. స్టూడెంట్స్ను చంపేస్తామంటూ ఒక గ్రూప్ వార్నింగ్ ఇచ్చింది. పూర్తి వివరాలు మీ కోసం..
పంజాబ్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అమృత్ పాల్ సింగ్. గత ఏడా ది ఫిబ్రవరి వరకు అనామకుడిగా ఉన్న అమృత్.. నటుడు దీప్ సిద్దు చనిపోయిన తర్వాత అనూహ్యంగా వెలుగులోకి వచ్చాడు. అతడు స్థాపించిన వారిస్ పంజాబ్ దే సంస్థను హైజాక్ చేసి.. దాని అధిపతి తానేనని ప్రకటించుకున్నాడు. ఇటీవల ఓ పోలీస్ స్టేషన్ పై దాడి చేయించడంతో అతడి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది.
పంచ నదులు పారే పుణ్యభూమి పంజాబ్.. ఎప్పుడూ పచ్చని పంటపొలాలతో ఉండే ఆ ప్రాంతంలో కొన్ని దశాబ్దాల క్రితం ఓ హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది. మళ్లీ అలాంటి భయాందోళనలు కలిగించే కార్యక్రమాలు పంజాబ్లో జరుగుతున్నట్లు చర్చ నడుస్తోంది. ఇంతకీ పంజాబ్లో ఏం జరుగుతోంది?