తిరుమల శ్రీవారిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అని భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. క్షణకాలమైనా వేంకటేశ్వరుడ్ని కనులారా చూద్దామని అనుకుంటారు. అలాంటి వారికి టీటీడీ శుభవార్త చెప్పింది.
తిరుపతి రూరల్- తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు టీటీడీ ఓ వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే తిరుమల వెళ్లేందుకు ప్రత్యేక ప్రవేశ దర్శం టిక్కెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో, లాక్ డౌన్ వళ్ల తిరుమల వెళ్లలేకపోతున్నామని కంగారు పడాల్సిన పని లేదు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ తేదీ మార్చుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం కల్పించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి మే 31 […]