సమాజంలో ఎన్నో జంటలు అన్యోన్యంగా కలసి జీవిస్తుంటే..కొందరు దంపతులు మాత్రం మనస్పర్థల కారణంగా విడిపోతుంటారు. అంతేకాక కొన్ని సందర్భాల్లో వారు ఒకరిపై మరొకరు పరువు నష్ట దావా కూడా వేస్తుంటారు. ముఖ్యంగా సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు వేస్తుంటారు. ఇలా తమ మాజీ భార్యలపై, భర్తలపై పరువు నష్ట దావా వేసిన నటీ, నటులు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ నటుడు కూడా తన మాజీ భార్యపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశాడు.
నటుడిగా ఎంత గొప్ప పేరు సంపాదంచుకున్నా కూడా వ్యక్తిగత జీవితంలో మాత్రం నవాజుద్దిన్ సిద్దిఖీపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అతని భార్య అలియా తాజాగా అతనిపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. తమని ఇంట్లో నుంచి గెంటేశాడు అని ఆరోపించింది.
తనను, తన పిల్లలను పట్టించుకోలేదని ప్రముఖ నటుడి భార్య ఆరోపణలు చేసింది. దాంతో ఖర్చుల కోసం చివరికి ఆ పని చెయ్యాల్సి వచ్చిందని సదరు నటుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది.
బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. విభిన్న పాత్రలు పోషిస్తూ..నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల సంగతి అలా ఉంచితే.. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి నిత్యం ఏదో వివాదం నడుస్తూనే ఉంటుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆయన భార్య ఆలియా గత కొంత కాలంగా సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే నవాజుద్దీన్ సిద్ధిఖీ తల్లిపై ఆలియా సిద్ధిఖీ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా […]