సెంచూరియన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య ప్రారంభమైన మొదటి టెస్ట్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ జోడీ 100 పరుగుల పైచిలుకు భాగస్వామ్యం అందించింది. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా వెళ్తున్నట్లు కనిపించింది.
కానీ.. లుంగీ ఎన్గిడీ వేసిన 41వ ఓవర్ రెండు బంతికి మయాంక్ అగర్వాల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 117 పరుగుల వద్ద భారత్ మొదటి వికెట్ను కోల్పోయింది. మయాంక్ 122 బంతుల్లో 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో చటేశ్వర్ పుజారా వన్డౌన్లో బ్యాటింగ్ వచ్చాడు. ఎన్గిడీ బౌలింగ్లో ఎదుర్కొన్న మొదటి బంతికే క్యాచ్ ఇచ్చి పుజారా అవుట్ అయి.. గ్లోడెన్ డక్గా వెనుదిరిగాడు. దీంతో ఒక్కసారిగా స్థిరంగా సాగుతున్న భారత్ ఇన్నింగ్స్లో కుదుపు వచ్చింది. కాగా పుజారా సౌతాఫ్రికాలో రెండోసారి గ్లోడెన్ డక్గా అవుట్ అయ్యాడు.
ఇదీ చదవండి: IND vs NZ 2nd Test: ఒకే ఓవర్లో పుజారా, కోహ్లీ డకౌట్
గతంలో 2017లో టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటించినప్పుడు కూడా ఇదే సెంచూరియన్ గ్రౌండ్లో జరిగన టెస్ట్ మ్యాచ్లో పుజారా గ్లోడెన్ డక్గా అవుట్ అయ్యాడు. అప్పుడు కూడా ఎన్గిడీనే పుజారాను రన్అవుట్ చేసి పెవిలియన్కు పంపాడు. దీంతో ఎన్గిడీ పుజారాపై పగబట్టినట్లు ఉన్నాడా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి పుజారా వరుస వైఫల్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.