దేశీయ క్రీడ కబడ్డీకి కమర్షియల్ హంగులు అద్ది ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ప్రో కబడ్డీ లీగ్ సందడి మళ్లీ మొదలైంది. గతేడాది కరోనా కారణంగా ప్రో కబడ్డీ లీగ్ జరగలేదు. ఇప్పుడు సీజన్ 8 ప్రారంభమైంది. బుధవారం తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.
గురువారం జరిగిన మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 41–30 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్ను ఓడించింది. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ ఏకంగా 16 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 24 సార్లు రైడింగ్కు వెళ్లిన నవీన్ 14 సార్లు పాయింట్లతో తిరిగి వచ్చాడు. మ్యాచ్లో కనీసం 10 పాయింట్లు స్కోరు చేయడం పీకేఎల్లో నవీన్కిది వరుసగా 22వ సారి కావడం విశేషం. ఢిల్లీ ఆల్రౌండర్లు విజయ్ తొమ్మిది పాయింట్లు, సందీప్ నర్వాల్ మూడు పాయింట్లు స్కోరు చేశారు.
NYP Aslam Inamdar stunned everyone with his remarkable performance.
Comment 😍 if you want to see him play more!
.
.#DELvPUN #SuperHitPanga #PuneriPaltan #GheunTak #BhaariKabaddi #vivoProkabaddi @ProKabaddi @indigopaints pic.twitter.com/66jvUlocdG— Puneri Paltan (@PuneriPaltan) December 24, 2021
పుణేరి పల్టన్ తరఫున కెప్టెన్ నితిన్ తోమర్ ఏడు పాయింట్లు, రాహుల్ చౌదరీ ఐదు పాయింట్లు సాధించారు. గురువారమే జరిగిన మరో రెండు మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్ 42–39తో హరియాణా స్టీలర్స్పై, గుజరాత్ జెయింట్స్ 34–27తో జైపూర్ పింక్ పాంథర్స్పై విజయం సాధించాయి. మళ్లీ రేపు తెలుగు టైటాన్స్, పుణెరీ పల్టన్తో తలపడనుంది. మరి నవీన్ ఆటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.