టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ ఇటీవలే తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్ ను వివాహం చేసుకున్నాడు. జూన్ 2న ఆగ్రాలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లి పనులు పూర్తవడంతో.. త్వరలోనే ఈ జంట హనీమూన్ ప్లాన్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో.. దీపక్ చాహర్ సోదరి మాలతి చాహర్.. తమ్ముడికి హనీమూన్ లో ఎలా నడుచుకోవాలో హితోపదేశం చేసింది. ఆ వ్యాఖ్యలు కాస్తా.. బోల్డ్ గా ఉండడంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఒక అక్కగా ఏం మాట్లాడాలో తెలియదా? పాశ్చాత్య సంస్కృతి ప్రభావం మీ మీద బాగా పడినట్లుంది? అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం మాలతి చాహర్ వ్యవహారం సోషల్ మీడియాలో మంచి హాట్టాపిక్గా మారింది.
దీపక్ చాహర్, జయా భరద్వాజ్ ల జంటకు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మాజీ, సహచర క్రికెటర్లతో పాటు అభిమానులు దీపక్కు విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలోనే అతని సోదరి మాలతి సైతం తమ్ముడు, మరదల్ని విష్ చేసింది. సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గా ఉండే మాలతి.. తనదైన శైలిలో విష్ చేసి వివాదంలో చిక్కుకుంది. కొత్త దంపతులతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్న మాలతి చాహర్.. తమ్ముడూ హనీమూన్ లో నీ నడుము జాగ్రత్త అని రాసుకొచ్చింది. “ఇప్పుడు ఈమె మన ఇంటి పిల్ల అయిపోయింది. మీ వైవాహిక జీవితం నూరేళ్లు సాఫీగా సాగిపోవాలని ఆశిస్తున్నాను. తమ్ముడూ.. హనీమూన్ లో నీ నడుము జాగ్రత్త గా చూసుకో ప్లీజ్. అసలే మనకు ముందు టీ20 ప్రపంచకప్ ఉంది..” అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
Ab ladki hui humari….Wish you guys a very happy married life🧿 @deepak_chahar9 please take care of your back during your honeymoon..we have World Cup ahead 😜#family #brother #marriage #siblings pic.twitter.com/Hm2unculO7
— Malti Chahar🇮🇳 (@ChaharMalti) June 3, 2022
ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మాలతిని విమర్శిస్తున్నారు. మరీ ఇంత ఓవరాక్షన్ అవసరం లేదని, ఒక అక్కగా మీరు మాట్లాడే మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. మరికొంత మంది మాత్రం ప్రతీ విషయానికి తప్పు అర్థాలు ఆపాదించి, విమర్శించడం అలవాటుగా మారిందంటూ మాలతికి అండగా నిలుస్తున్నారు. సరదాగా ఆమె చేసిన ట్వీట్ను ఇంతలా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని కామెంట్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mohammed Siraj: నిన్నటి వరకు కోహ్లీ అనుచరుడు. ఒక్కసారిగా కోహ్లీని కాదని..!
ఇక.. ఐపీఎల్-2022 మెగా వేలంలో 14 కోట్లకు సీఎస్కే దీపక్ చహర్ను కొనుగోలు చేయగా గాయం కారణంగా సీజన్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ప్రస్తుతం వెన్నుగాయంతో బాధపడుతున్న దీపక్.. పూర్తిగా కోలుకోవడానికి కనీసం మరో మూడు నెలలు పడుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు కూడా అతడు ఎంపికకాలేదు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.