బెంగుళూరు వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. పింక్ బాల్తో ప్రత్యర్థి జట్టును హడలెత్తించారు. 30 ఓవర్లలోనే 6 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా మొహమ్మద్ షమీ తీసిన ఓ వికెట్ అయితే మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. శ్రీలంక ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఆ స్టన్నింగ్ డెలివరీ చోటు చేసుకుంది.
షమీ వేసిన తన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కే శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పింక్ బాల్పై ఉండే ఎక్స్ట్రా సీమ్ను తనకు అనుగుణంగా మార్చుకున్న షమీ.. బాల్ను అద్భుతంగా టర్న్ చేశాడు. అతను వేసిన బాల్ ఆఫ్ స్టంప్ వెలుపల పడి టర్న్ అయ్యి నేరుగా వికెట్లను గిరాటేసింది. కరుణ రత్నే బంతిని అంచనా వేసేలోపే అద్భుతం జరిగిపోయింది. షమీ సూపర్ బాల్కు షాక్ అయ్యాడు కరుణరత్నే. బాల్ అలా ఎలా వచ్చిందనే ఆశ్చర్యంలోనే పెవిలియన్ చేరాడు.
కాగా షమీ వేసిన సూపర్ బాల్ ఈ వికెట్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. షమీ సూపర్ బాల్కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సొంతగడ్డపై ఇంతకుముందు ఆడిన రెండు డే/నైట్ టెస్ట్లను వరుసగా 3, 2 రోజుల్లోనే ప్రత్యర్థులను చుట్టేసిన భారత్.. మూడో మ్యాచ్లోనూ అదే సీన్ రిపీట్ చేసేలా కనిపిస్తుంది. మరి షమీ బౌలింగ్పై, కరుణరత్నేను బౌల్డ్ చేసిన సూపర్ బాల్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సస్పెన్స్ సినిమాని తలపించేలా మయాంక్ అగర్వాల్ రనౌట్!
— Sayyad Nag Pasha (@PashaNag) March 13, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.