ఇండియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్.. . కోట్ల వ్యవహారాలను సింగిల్ హ్యాండ్ తో మైంటైన్ చేస్తూ.. ఇండియన్ క్రికెట్ ని ఆర్గనైజ్డ్ గా నడిపించడం దీని పని. సంపద సృష్టించడంలో, దేశంలో క్రికెట్ కి క్రేజ్ తీసుకుని రావడంలో బీసీసీఐ సూపర్ సక్సెస్ అయ్యిందనే చెప్పుకోవాలి. ప్రపంచంలో అన్నీ క్రికెట్ బోర్డ్స్ కన్నా బీసీసీఐ చాలా రిచ్. ఇదంతా కేవలం ఐపీఎల్ ద్వారానే సాధ్యం అయ్యింది. కానీ.., ఈరిచ్ లీగ్ కారణంగా బీసీసీఐకి భారీ ఆదాయమే కాదు, కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఇందులో భాగంగానే డెక్కన్ ఛార్జర్స్ బీసీసీఐల మధ్య కొన్ని సంవత్సరాలుగా కోల్డ్వార్ నడుస్తోంది. ఇక డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ కు రూ. 4,800 కోట్లు చెల్లించాలంటూ ఆర్బిటర్ ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు కొట్టిపారేసింది. జస్టిస్ జీఎస్ పటేల్తో కూడిన బెంచ్ తాజాగా ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ తీర్పు బీసీసీఐకి భారీ ఊరటనిచినట్టు అయ్యింది. అసలు.., బీసీసీఐకి డెక్కన్ ఛార్జర్స్ కి మధ్య రూ.4,800 కోట్లు రేంజ్ లో వచ్చిన గ్యాప్ ఏంటన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
2008లో ఐపీఎల్ మొదలైంది. అక్కడ నుండి ఐదేళ్ల పాటు డెక్కన్ చార్జెస్ టోర్నీలో పాల్గొంటూ వచ్చింది. కానీ.., డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ అప్పట్లో బీసీసీఐకి రూ.100 కోట్లు నేషనల్ బ్యాంక్ నుంచి పూచీకత్తుగా ఇవ్వడంలో విఫలమైంది. దాంతో.. ఆగ్రహించిన బీసీసీఐ.. 2012లో టోర్నీ ముగిశాక డెక్కన్ ఛార్జర్స్ టీమ్ని ఐపీఎల్ ఫ్రాంచైజీస్ లిస్ట్ నుండి తొలగించింది. తరువాత డెక్కన్ చార్జెస్ స్థానంలోసన్రైజర్స్ హైదరాబాద్ వచ్చి చేరింది. ఈ విషయంలో డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంఛైజీ కోర్టుకి వెళ్ళింది. దీంతో.., డెక్కన్ ఛార్జర్స్ టీమ్ని చట్ట విరుద్ధంగా బీసీసీఐ తొలగించిందని తేల్చిన జస్టిస్ సీకే టక్కర్.. ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యానికి రూ. 4,800 కోట్లు పరిహారం కింద చెల్లించాలని తీర్పు వెలువరించారు. ఈ విషయంలో బీసీసీఐ మళ్ళీ ముంబై హైకోర్టు మెట్లు ఎక్కింది. ఇక అప్పటి నుండి సాగుతూ వచ్చిన ఈ కేసులో ఇప్పుడు తీర్పు వచ్చింది. బీసీసీఐ అన్నీ అగ్రిమెంట్ ప్రకారమే చేసిందని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడటంతో బోర్డుకి వేల కోట్లలో నష్టం వచ్చింది. ఇలాంటి సమయంలో ముంబై హైకోర్టు తీర్పుతో బీసీసీఐకి రూ. 4,800 కోట్లు నష్టం తప్పినట్టు అయ్యింది.