Kaivalya Reddy: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి తెలుగు దేశం పార్టీలో చేరనున్నారని సమాచారం. మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు స్థానంలో టీడీపీ నుంచి పోటీకి దిగాలనే ఆలోచనలో కైవల్యా రెడ్డి ఉన్నారంట. శనివారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబును ఆమె కలవటం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. లోకేష్ వద్ద ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రస్తావన తెచ్చారని సమాచారం. కాగా, మంత్రి గౌతమ్రెడ్డి మరణంతో ఆత్మకూరులో ఏర్పడ్డ ఖాళీకి జూన్ 23న ఉప ఎన్నిక జరగనుంది. ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలచేసింది.
ఇక, వైఎస్సార్ సీపీ తమ అభ్యర్థిగా గౌతమ్రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీలో దించింది. బీజేపీ, తెలుగు దేశం పార్టీలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. పోటీపై బీజేపీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. మరి, టీడీపీ పోటీలో దిగుతుందా లేదా అన్నదాంట్లో క్లారిటీ లేదు. జనసేన విషయానికి వస్తే.. గౌతమ్రెడ్డి గౌరవార్థం పోటీలో దిగకపోవచ్చు.
ఇవి కూడా చదవండి : Atmakur Bypoll: ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో బీజేపీ.. అధికార పార్టీ అభ్యర్థిపై పోటీకి సై!