ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ.. వైసీపీలో చిచ్చు పెట్టింది. మరోసారి, కొత్తగా మంత్రి పదవి దక్కిన వారు ఫుల్లు ఖుషిగా ఉండగా.. పదవి కోల్పోయిన పాత మంత్రుల్లో కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తి ఉన్నారు. ఈ క్రమంలో తన ఎమ్మెల్యే పదవికీ రాజీనామ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. బాలినేనికి మంత్రి పదవి రాకపోవడంతో ఆయన అనుచర వర్గం కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో కొందరు ప్రజాప్రనిధులు.. తమ పదవులకు సైతం రాజీనామా చేశారు. మరి కొందరు కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. సంతమాగులూరు ఎంపీపీ వెంకటరెడ్డి, ఒంగోలు మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొటారి రామచంద్రరావు తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొన్ని చోట్ల ఎంపీటీసీలు, సర్పంచ్ లు కూడా రాజీనామాలకు సిద్దపడినట్లు తెలుస్తోంది.ఈక్రమంలోబాలినేని నివాసానికి చేరుకుంటున్నారు ప్రకాశం జిల్లా నేతలు.. భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్య నాయకులతో బాలినేని సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ రెడ్డి కూడా బాలినేని శ్రీనివాస్రెడ్డిని కలిశారు. ఇక, బాలినేని నివాసంలో ఎలాంటి చర్చ జరుగుతుంది అనేదానిపై ఉత్కంఠ నెలకొనగా.. బాలినేని త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటారంటూ ప్రచారం కూడా సాగుతోంది. అయితే, బాలినేని అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమే అయినా.. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోరనే చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే కేబినెట్ లో చోటుదక్కని నేపథ్యంలో హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ఆమె కుమార్తె రిషిత నిన్న రాత్రి మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. మరి.. ఈఘటనలపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.