ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయలు నిత్యం వాడివేడిగా ఉంటాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటుంది. పరిపాలకు సంబంధించిన ప్రతి విషయంలో అధికార వైసీపీపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ విమర్శలు గుప్పిస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకపడుతున్నారు. ఇటీవల అవినీతి నిర్మూలన కోసం ఏపీ ప్రభుత్వం ‘ACB 14400’ అనే యాప్ ను ప్రారంభించింది. తాజాగా దీనిపై కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజలను దోచుకుంటున్న వైసీపీ పాలకుల మీద ఫిర్యాదు చేయ్యాలంటే ఏ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి? అంటూ ట్వీట్ చేశారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని రూపు మాపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దిశ యాప్తో సంచలనం సృష్టించిన ప్రభుత్వం.. అవినీతిపై కూడా అదేస్థాయిలో పోరాటానికి సిద్ధపడింది. దీనికి అనుగుణంగానే ఏసీబీ 14400 పేరుతో యాప్ను రూపొందించి ప్రజల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అవినీతి నిర్మూలనకు ఏసీబీ తీసుకొచ్చిన సరికొత్త యాప్ను ఇటీవల క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు. స్పందనపై సమీక్షలో భాగంగా యాప్ స్టార్ట్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాటే చెబుతున్నామని.. ఆ దిశగానే కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు సీఎం జగన్.
అయితే తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు అవినీతిపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు ట్వీటర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. “మరి.. వైసీపీ పాలకుల అవినీతి గురించి, వారి ఎమ్మెల్యేల దోపిడీ, దౌర్జన్యాల మీద కంప్లెంట్ చెయ్యలంటే ప్రజలు ఏ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి? ” అంటూ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు. మరి.. పవన్ కల్యాణ్ షేర్ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరి వైసిపి పాలకుల అవినీతి గురించి ,వారి mlaల దోపిడీ ,దౌర్జన్యాల మీద complaint చెయ్యలంటే ప్రజలు ఏ app download చేసుకోవాలి? https://t.co/lEWXxnlJsZ
— Pawan Kalyan (@PawanKalyan) June 6, 2022