కొన్ని రోజుల క్రితం వరకు ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్ కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లే ఆయన బీసీ సంఘాల నేతలతో చర్చలు జరపడం, ఉండవల్లి అరుణ్ కుమార్ని కలవడంతో.. ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే బ్రదర్ అనిల్ కుమార్ ఈ వార్తలను ఖండించారు. ఈ క్రమంలో తాజాగా ఏపీలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజునే ఈ పార్టీ ఆవిర్భావం చోటు చేసుకోవడం విశేషం. ఆ వివరాలు..
అంబేడ్కర్ జయంతి రోజున ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. గురువారం సాయంత్రం విజయవాడలో జైభీమ్ భారత్ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించారు పార్టీ సభ్యులు. ఈ సందర్భంగా హైకోర్టు లాయర్, మాజీ న్యాయమూర్తి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది. దళితుల కోసం పోరాడే పార్టీ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు. నేను 28 ఏళ్లకే న్యాయమూర్తిని అయ్యాను. పదేళ్లలో ఆ పదవిని వదిలి వచ్చాను. రూపాయికి కిలో బియ్యం, 200 రూపాయలకు వంట నూనె ప్యాకెట్ ఇచ్చే పార్టీలను పొగుడుదామా’’ అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: నా కూతురు తెలియక దాన్ని రాజీనామా అనుకుంది: మేకతోటి సుచరిత‘‘దళిత బిడ్డలకు మేనమామ అని చెప్పిన జగన్.. ఆ తరువాత చేసిన అన్యాయం ఎవరు మర్చిపోరు. వైసీపీ దుర్మార్గ పాలనను ప్రశ్నించాలి. ఆ పార్టీలోని దళిత నాయకులను ఓడించేందుకే ఈ పార్టీ పెడుతున్నాను. ప్రజలకు అన్యాయం చేసేవారిని ప్రశ్నిస్తాను. సాంఘిక సంక్షేమశాఖ మంత్రితో సబ్ప్లాన్పై ఎక్కడైనా చర్చించడానికి నేను సిద్ధం. 26 రకాల దళిత స్కీమ్లను జగన్ రద్దు చేశారు. విదేశీ విద్య కోసం వెళ్లే వారు ప్రభుత్వం నుంచి నిధులు అందక ఇబ్బంది పడుతున్నారు. ఈ అన్యాయాలను ప్రశ్నించేందుకు పార్టీ పెట్టాను. ఓడిపో.. ఓడించు.. గెలువు అన్న కాన్షీరామ్ మాటలు నాకు స్ఫూర్తి’’ అని శ్రవణ్కుమార్ తెలిపారు.
ఇది కూడా చదవండి: మంత్రి అమర్నాథ్పై RGV ట్వీట్.. ఈ వయసుకే ఇంత సాధిస్తే అంటూ!
కొత్త పార్టీ ఏర్పాటు గురించి గతంలోనే శ్రవణ్ కుమార్ ప్రకటించారు. 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోనూ దళిత బహుజనులను పోటీ చేయిస్తామని చెప్పారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని.. వాటిని నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అలాగే దళితుల సమస్యలపై చర్చించేందుకు ప్రతి నెలా ‘దళిత అసెంబ్లీ’ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మరో నూతన పార్టీ ఆవిర్భావం ఆసక్తికరంగా మారింది. మరి కొత్త పార్టీ ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపగలదా లేదా అనే అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ సహాయం కోరిన JC. ప్రభార్ రెడ్డి!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.