గత కొన్ని రోజులుగా తనపై జరుగుతున్న ప్రచారాలపై వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా గాలి భాను ప్రకాష్ చేసిన అవినీతి ఆరోపణలను తీవ్రంగా ఖండిచారు రోజా. ఓడిపోయి రెండేళ్లుగా నియోజకవర్గం వైపు తిరిగిచూడని వ్యక్తి ఇప్పుడు ప్రత్యక్షమై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అవినీతిపరుడైన భానుకు అందరూ అవినీతిపరుల్లానే కనిపిస్తారన్నారు.
ఇది కూడా చదవండి: సీఎం జగన్ నిర్ణయంతో అయోమయంలో ఎమ్మెల్యే రోజా
తాను నంబర్వన్ హీరోయిన్గా ఉన్నప్పుడే మద్రాసులో ఇల్లు నిర్మించుకున్నానని తెలిపారు. వైఎస్సార్సీపీలోకి రాకముందు హైదరాబాద్లో ఇల్లు నిర్మించుకున్నానని, నగరిలో ఇల్లు పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు కట్టానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉండాలని ఇల్లు కట్టుకుట్టున్నట్టు వెల్లడించారు. తన జీవితంలో ప్రతి ఒక్కటీ తన సొంత డబ్బుతో కట్టిందేనన్నారు. అక్రమంగా సంపాదించాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. జగనన్న అడుగుజాడల్లో క్రమశిక్షణతో పనిచేసే తనకు ఒకరికి ఇవ్వడమే కానీ, తీసుకోవడం అలవాటు లేదన్నారు. పైగా తన పేరు మీదనే ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమలు చేస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి : విజయవాడ బాలిక ఆత్మహత్య ఘటనపై రోజా ఫైర్!
రాజీనామా వార్త అవాస్తవం
తాను రాజీనామా చేస్తున్నట్లు సోషల్మీడియా, మీడియాలో వస్తున్న వార్తలపైనా ఆమె స్పందించారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని, తెలంగాణకు వెళుతున్నానని కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. తానెందుకు పార్టీ నుంచి వెళతానని ప్రశ్నించారు. తప్పుచేసినవారు వెళ్లాలన్నారు. ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు. సొంత చెల్లిగా భావించి రెండు సార్లు ఎమ్మెల్యేను చేసిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని, ప్రాణం ఉన్నంత వరకు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని అన్నారు. రోజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.