మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు తీర్పు అనంతరం విపక్షాలు, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున్న విమర్శలు చేస్తున్నాయి. ఏపీకి అమరావతే రాజధాని అని కోర్టు తీర్పుతో మరోసారి స్పష్టం అయ్యింది అంటున్నారు. ఈ క్రమంలో హీరో శివాజీ ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై విమర్శలు చేశారు. అన్నీ రంగాల్లో ఆంధ్ర ప్రదేశ్ వెనుక పడుతుందని అన్నారు. ఈ సదర్భంగా శివాజీ మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక కుటుంబం ఈవీఎం ఎప్పుడు కనపడుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఈప్రభుత్వాన్ని తట్టుకోలేకపోతున్నారు. మూడు రాజధానులు అనే అంశంపై దమ్ముంటే ఈరోజు ఎన్నికలకు వెళదాం’’ అన్నారు.
‘‘వైసీపీ నేతలు అద్భుతమైన పరిపాలన చేశారని నమ్ముతున్నారు కదా, ఎన్నికలకు వెళదాం. ఒక్కడు అంటే ఒక్కడు గెలవడు. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. దీనిపై వాదన.. యుద్ధం చేసే స్థాయి నాకు లేదు కానీ.. కొడాలి నానిగారిలా కింద స్థాయి మాటలు నేను మాట్లాడలేను. నేను.. కొడాలి నాని ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఆయన గుడివాడ, నేను మా నియోజక వర్గం తప్ప ఏపీలో ఎక్కడైనా పోటీ పడదాం. కొడాలి నాని గెలిస్తే నేను ఆత్మ హత్య చేసుకుంటాను’’ అని శివాజీ బహిరంగ సవాలు చేశారు.
ప్రస్తుతం హీరో శివాజీ చేసిన సవాలు నెట్టింట వైరలవుతోంది. ఇది చూసిన జనాలు.. గతంలో బడ్ల గణేష్ చేసిన ఒపెన్ చాలేంజ్ని గుర్తు చేసుకుంటున్నారు. మరి శివాజీ చాలెంజ్ పై మంత్రి కొడాలి నాని ఎలా స్పందిస్తారో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.