president elections: ప్రస్తుత భారత రాష్ట్రపతి పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. గత 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతి అభ్యర్థిగా చాలా మంది పేర్లు వినిపించాయి. బీజేపీ సీనియర్ మహిళా నేత, ఎస్టీ వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము పేరు మరింత గట్టిగా వినిపించింది. ఆమె రాష్ట్రపతి అవ్వటం ఖాయం అన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే, బీజేపీ అధిష్టానం మాత్రం తమ అభ్యర్థి పేరును అధికారికంగా ఆఖరి వరకు బయటకు ప్రకటించలేదు. చివరి నిమిషంలో అనూహ్యంగా రామ్నాథ్ కోవింద్ను తెరపైకి తెచ్చింది. ఎస్సీ వర్గానికి చెందిన రామ్నాథ్కు అన్ని పార్టీల మద్దతు లభించింది. రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. పోయిన సారి రాష్ట్రపతి పదవి ఆశించి భంగపడ్డవారిలో మళ్లీ కొత్తగా ఆశలు మొదలయ్యాయి. నిన్నటివరకు రాష్ట్రపతి అభ్యర్థి రేసులో బీజేపీనుంచి వెంకయ్య నాయుడు పేరు గట్టిగా వినిపించింది. వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అవ్వనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఆ వార్తల్ని వెంకయ్య నాయుడు ఖండించారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఏకగ్రీవంగా గెలిపించుకునేంత బలం ఎన్డీఏ కూటమిలోని బీజేపీకి లేదు. ఇందు కారణంగా పక్క పార్టీలను కలుపుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి మద్దతు తప్పని సరి కావటంతో బీజేపీ కొంతమంది పక్క పార్టీ నేతల పేర్లను కూడా పరిగణలోకి తీసుకుంటోంది.గులాం నబీ ఆజాద్, శరద్ పవార్ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీలోని కీలక నేతలు దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్కే అద్వానీకి కానీ, వెంకయ్య నాయుడికి లేదా ద్రౌపదీ ముర్ముకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంట. ఈ నేపథ్యంలో మరోసారి ద్రౌపదీ ముర్ము తెరపైకి వచ్చారు. అన్ని ఈక్వేషన్ల పరంగా బీజేపీకి ముర్ము ది బెస్ట్ ఛాయిస్. పార్టీకి ఎంతో విధేయురాలు.. పైగా మహిళ. బీజేపీ కూడా మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ద్రౌపదీ ముర్ము దేశ రాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఎక్కువన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ద్రౌపదీ ముర్ము నేపథ్యం :
ద్రౌపదీ ముర్ము 1958 జూన్ 20న ఒడిస్సాలోని మయుర్భంజ్ జిల్లా బైదాపోసి గ్రామంలో జన్మించారు. ముర్ము శాంతల్ తెగకు చెందిన గిరిజన మహిళ. ఆమె శ్యామ్ చరణ్ ముర్మును వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. ఓ రోడ్డు ప్రమాదంలో భర్తతో పాటు ఇద్దరు కుమారుల్ని కోల్పోయారు.
రాజకీయ ప్రస్థానం :ముర్ము టీచర్ ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒరిస్సాలో ఒక పర్యాయం గిరిజన శాఖ మంత్రిగా పని చేశారు. జార్ఖండ్ రాష్ట్ర తొలి గవర్నర్గా ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఒరిస్సా బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. మరి, రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి రేసులో ద్రౌపదీ ముర్ముపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Prashant Kishor: కాంగ్రెస్కు షాక్.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.