ఏపీలో కొత్త మంత్రి వర్గ విస్తరణకు రంగ సిద్దమైంది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సీఎం జగన్ తన కొత్త మంత్రివర్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త మంత్రివర్గం ఏర్పాటుపై కసరత్తు పూర్తైంయింది. చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేసిన అనంతరం తుది జాబితాను సిద్ధం తయారు చేశారు. కొత్త మంత్రుల జాబితాను సీఎంవో గవర్నర్ కు పంపనుంది. ఆ తర్వాత వ్యక్తిగతంగానూ సీఎంవో అధికారులు ఫోన్లు చేసి జాబితలో ఉన్న వారికి సమాచారం ఇవ్వనున్నారు. కొత్త మంత్రుల జాబితా తన వద్దకు రాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపనున్నారు.
ఇదిలా ఉంటే.. ఎవరిని మంత్రి పీఠం వరిసస్తుందో అని ఆశావహులు ఉత్కంఠలో ఉన్నారు. ఈ క్రమంలో కొత్త మంత్రి వర్గంలో చోటు దక్కినట్లు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. గుడివాడ అమర్నాథ్,దాడిశెట్టి రాజా, బొత్స సత్యనారాయణ, రాజన్నదొర, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, బూడి ముత్యాలనాయుడు, విడదల రజిని, కాకాణి గోవర్ధన్రెడ్డి, అంజాద్ బాషా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, పినిపె విశ్వరూప్, గుమ్మనూరు జయరాం, ఆర్కే రోజా, ఉషశ్రీ చరణ్, తిప్పేస్వామి, చెల్లుబోయిన వేణుగోపాల్,నారాయణస్వామిలకు కొత్త మంత్రి వర్గంలో చోటు దక్కినట్లు సమాచారం. మరి.. ఈ కొత్త కేబినెట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.